Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
యాంకర్ అనసూయకు మరో గోల్డెన్ ఆఫర్.. నెవర్ బిఫోర్ అనేలా..
జబర్దస్త్ గ్లామరస్ యాంకర్ అనసూయ బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా పెర్ఫెమెన్స్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఎలాంటి పాత్రలో కనిపించినా కూడా సినిమాపై బజ్ క్రియేట్ అవ్వడం కామన్. అయితే ప్రస్తుతం అనసూయ ఒక మాస్ హీరో సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. ఈ మధ్య రియాలిటీ షోల కంటే కూడా సినిమాలతోనే ఈ యాంకర్ ఎక్కువగా బిజీ అవుతున్నారు.
టాలీవుడ్ రంగమ్మత్తగా అనసూయ తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య నాగార్జున సోగ్గాడే చిన్న నాయన సినిమాలో కూడా టైటిల్ సాంగ్ తో రచ్చ చేసిన అనసూయ క్షణం వంటి సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించి తన స్థాయిని పెంచుకుంది. రంగస్థలం సినిమాతో అనసూయ రేంజ్ మరో లెవెల్ కు వెళ్లిందనే చెప్పాలి. ఇక మళ్ళీ అలాంటి పాత్రలో కనిపించని ఆమె ఇప్పుడు అంతకుమించి అనేలా గోపీచంద్ సినిమాలో ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
గోపిచంద్ మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో గతంలో ఎప్పుడు కనిపించని విభిన్నమైన పాత్రలో అనసూయ దర్శనమివ్వనుందట. ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 5 నుంచి స్టార్ట్ కానుంది. ఇక సినిమాను అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు ముందే ఎనౌన్స్ చేశారు. మరి ఈ సినిమా ద్వారా యాంకర్ అనసూయ ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుంటారో చూడాలి. పక్కా కమర్షియల్ సినిమాలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటించనుంది.