Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
SSMB28: మహేశ్ బాబు తండ్రిగా స్టార్ హీరో.. కుంభస్థలాన్నే టార్గెట్ చేసిన త్రివిక్రమ్
పేరుకు సూపర్ స్టార్ కృష్ణ కుమారుడే అయినా.. చిన్న వయసులోనే తన సత్తాను చాటుకుని.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మహేశ్ బాబు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్తో పాటు హ్యాండ్సమ్ లుక్స్తో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తద్వారా ఎన్నో విజయాలను అందుకోవడంతో పాటు తన మార్కెట్ను కూడా భారీగా పెంచుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
వరుస విజయాలతో ఫుల్ ఫామ్
ఆ మధ్య కొన్ని పరాజయాలతో సతమతం అయిన మహేశ్ బాబు.. కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. దీంతో హ్యాట్రిక్ను కూడా అందుకున్నాడు. అలాగే మహేశ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసి ఫుల్ ఫామ్తో కనిపిస్తున్నాడు.
Bigg Boss Non Stop: బాత్రూంలో చూశా నీవి తగ్గిపోయాయి.. బిందుపై అఖిల్ కామెంట్స్.. బయటపెట్టిన నాగ్
పరశురాంతో పాట పాడిన స్టార్
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి థమన్ సంగీతం అదిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తైపోయింది.
గురూజీతో మరో సినిమాకు సై
సర్కారు వారి పాట చేస్తోన్న సమయంలోనే మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. దీనికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి.
Divi Vadthya: స్విమ్మింగ్ పూల్లో బిగ్ బాస్ దివి గ్లామర్ షో.. తడిచిన అందాలతో ఫ్యాన్స్కు ఊరింపు!
ఎప్పుడో ప్రకటించినా లేటుగా
త్రివిక్రమ్ శ్రీనివాస్తో మహేశ్ బాబు చేయాల్సిన సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుండడంతో ఇది మొదలవలేదు. ఇంతలో ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతడికి కరోనా సోకింది. దీంతో అతడి ప్లాన్స్ మొత్తం మారిపోయాయి. ఫలితంగా ఇది మరింత ఆలస్యం కానుంది.
త్రివిక్రమ్ ఫోకస్ నటుల మీదే
మహేశ్ బాబుతో చేయబోయే సినిమా కోసం త్రివిక్రమ్ పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఈ మూవీ కోసం ఆయన ఎప్పుడో డైలాగ్ వెర్షన్తో కూడిన ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడు. అంతేకాదు, థమన్ కూడా కొన్ని పాటలు సిద్ధం చేసి పెట్టేశాడు. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి.. ఇప్పుడు నటుల ఎంపిక మీద దృష్టి సారించారని తెలిసింది. ఇప్పటికే కొందరిని సెలెక్ట్ చేసుకున్నారట.
హాట్ షోలో హద్దు దాటిన శివాత్మిక రాజశేఖర్: వామ్మో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరుగా!
మహేశ్ మూవీలో స్టార్ హీరోతో
దాదాపు 11 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రం మరికొందరు స్టార్ హీరోలను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అనిల్ కపూర్ పేరు బయటకు వచ్చింది.
అందుకే ఈ ప్లాన్ చేశాడా అని
త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో రాబోతున్న మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారని ఓ న్యూస్ లీకైంది. ఇందులో ఆయన హీరో తండ్రి పాత్రను చేస్తున్నారట. ఇప్పటికే దీనిని ఆ సీనియర్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తీసేందుకే బాలీవుడ్ స్టార్ను తీసుకున్నారని అంటున్నారు.