Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అనిల్ - మహేశ్ మూవీ స్టోరీ లైన్ లీక్: ఒక్కడు తర్వాత అలాంటి కాన్సెప్ట్.. ఊహించని పాత్రలో స్టార్ హీరో
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు ప్రిన్స్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ బెస్ట్ యాక్టర్గా పేరును సంపాదించుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మరిన్ని చిత్రాలను చేసేందుకు ప్లాన్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే త్వరలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!
హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ మహేశ్
ఆ మధ్య భారీ డిజాస్టర్లను చవి చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. కొరటాల శివ రూపొందించిన 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఒక్కో సినిమాను లైన్లో పెడుతున్నాడు మహేశ్ బాబు.
‘సర్కారు వారి పాట'తో వస్తున్నాడు
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రమే 'సర్కారు వారి పాట'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ల డైరెక్టర్గా పేరొందిన పరశురాం దీన్ని తెరకెక్కిస్తున్నాడు. కీర్తీ సురేష్ హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా బ్యాంకులను మోసం బిజినెస్మ్యాన్లను టార్గెట్ చేస్తున్నారు.
రాజమౌళితో మహేశ్ బాబు సినిమా
తెలుగు సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూస్తోన్న కాంబినేషన్లలో దర్శకధీరుడు రాజమౌళి - మహేశ్ బాబు కలయిక ఒకటి. ఈ ప్రాజెక్టు గురించి గత ఏడాదే క్లారిటీ వచ్చింది. లాక్డౌన్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, అదెప్పుడు మొదలవుతుందనేది మాత్రం వెల్లడించలేదు.
వాళ్లందరితో మహేశ్ బాబు చర్చలు
రాజమౌళితో రూపొందనున్న సినిమా చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో.. ఈ గ్యాప్లో మరిన్ని చిత్రాలను చేయాలని మహేశ్ బాబు డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో పలువురు దర్శకులతో కథా పరమైన చర్చలు కూడా జరిపాడు. అందులో వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్లు ఉన్నారనే టాక్ బాగా వినిపించింది.
త్రివిక్రమ్తో సినిమా ప్రకటించాడుగా
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ శనివారం సాయంత్రమే ఓ వీడియోను సైతం విడుదల చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతుందని కూడా ప్రకటన సమయంలోనే వెల్లడించారు.
అనిల్ రావిపూడితో ఇంకో ప్రాజెక్టు
వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న మహేశ్ బాబు.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సదరు దర్శకుడు 'మహేశ్ గారితో సినిమాకు కథ రెడీగా ఉంది. త్రివిక్రమ్ గారి సినిమా అయిపోయిన వెంటనే ఇది మొదలవుతుంది' అని ప్రకటించాడు. గతంలో వీళ్లిద్దరి కలయికలో 'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్ మూవీ వచ్చింది.
Recommended Video
ఒక్కడు తర్వాత అలాంటి కాన్సెప్ట్
మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా స్టోరీ లైన్ గురించి అప్పుడే ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంతో రాబోతుందట. అందులో హీరో కోచ్గా కనిపించబోతున్నాడని అంటున్నారు. యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో దీన్ని పాన్ ఇండియా రేంజ్లో తీస్తారట. గతంలో 'ఒక్కడు'లో మహేశ్ కబడ్డీ ఆటగాడిగా నటించాడు.