Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అంజలి మళ్లీ అదృశ్యం? పొలిటీషిన్తో పెళ్లంటూ పుకార్లు!
హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ఆ మధ్య అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత అజ్ఞాతం వీడి పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం వేధింపుల వల్లనే తాను ఈ పని చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత అంజలిపై వారిద్దరూ కోర్టులో కేసు వేసారు. ఆమెపై పలు కేసుల విచారణ సాగుతోంది.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అంజలి మళ్లీ అదృశ్యం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆమో ఫోన్ స్విచాఫ్ వస్తుందట. ఆమె ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని, ఇటీవల మద గజ రాజా సినిమా ప్రెస్ మీట్కు హాజరు కావాల్సి ఉన్నా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అంజలి 'మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె ఏ ప్రాజెక్టు సైన్ చేయలేదు. కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ రాజకీయ నాయకుడిని అంజలి పెళ్లాడబోతోందని, ఆ తర్వాత సినిమాలను పూర్తిగా వదిలేయాలన్న ఆలోచనలో ఉందట. యూఎస్కు ఓ ప్రొడక్షన్ మేనేజర్ను పెళ్లాడబోతున్నట్లు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
మరో వైపు అంజలి ప్రస్తుతం నటించిన 'మసాలా' చిత్రంతో పాటు, 'మద గజ రాజా' ఇంకా పోస్టు ప్రొడక్షన్ దశలోనే ఉంది. వీటి కోసం అంజలి చేయాల్సిన పనులు పెండిగులో ఉండటంతో ఆ చిత్ర నిర్మాతలు ఆందోళనలో పడ్డట్లు టాక్. మరి అంజలి నిజంగానే అదృశ్యం అయిందా? ఆమె పెళ్లి విషయమై వినిపిస్తున్న పుకార్లలో నిజం ఎంత అనేది ఆమె బయటకు వచ్చి స్వయంగా స్పందిస్తే తప్ప నమ్మలేం.