twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంజలి మళ్లీ అదృశ్యం? పొలిటీషిన్‌తో పెళ్లంటూ పుకార్లు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హీరోయిన్ అంజలి ఆ మధ్య అజ్ఞాతంలోకి వెళ్లి అందరినీ హైరానా పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత అజ్ఞాతం వీడి పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం వేధింపుల వల్లనే తాను ఈ పని చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత అంజలిపై వారిద్దరూ కోర్టులో కేసు వేసారు. ఆమెపై పలు కేసుల విచారణ సాగుతోంది.

    ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అంజలి మళ్లీ అదృశ్యం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆమో ఫోన్ స్విచాఫ్ వస్తుందట. ఆమె ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని, ఇటీవల మద గజ రాజా సినిమా ప్రెస్ మీట్‌కు హాజరు కావాల్సి ఉన్నా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం అంజలి 'మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె ఏ ప్రాజెక్టు సైన్ చేయలేదు. కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నాయకుడిని అంజలి పెళ్లాడబోతోందని, ఆ తర్వాత సినిమాలను పూర్తిగా వదిలేయాలన్న ఆలోచనలో ఉందట. యూఎస్‌కు ఓ ప్రొడక్షన్ మేనేజర్‌ను పెళ్లాడబోతున్నట్లు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.

    మరో వైపు అంజలి ప్రస్తుతం నటించిన 'మసాలా' చిత్రంతో పాటు, 'మద గజ రాజా' ఇంకా పోస్టు ప్రొడక్షన్ దశలోనే ఉంది. వీటి కోసం అంజలి చేయాల్సిన పనులు పెండిగులో ఉండటంతో ఆ చిత్ర నిర్మాతలు ఆందోళనలో పడ్డట్లు టాక్. మరి అంజలి నిజంగానే అదృశ్యం అయిందా? ఆమె పెళ్లి విషయమై వినిపిస్తున్న పుకార్లలో నిజం ఎంత అనేది ఆమె బయటకు వచ్చి స్వయంగా స్పందిస్తే తప్ప నమ్మలేం.

    English summary
    Actress Anjali has reportedly gone missing again. There is a buzz that Anjali has married a prominent politician in Andhra Pradesh while some media reports claim that she has married a US based production manager and settled down there. The actress' phone is reportedly switched off.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X