రవితేజ షూటింగ్ ఆగిందా?
రవితేజ, నయనతార కాంబినేషన్లో యువత ఫేమ్ పరుశరామ్ రూపొందిస్తున్న ఆంజనేయులు చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఆగిందని తెలుస్తోంది. ఈ షూటింగ్ నిమిత్తం యూనిట్ మొత్తం బ్యాంకాక్ వెళ్ళారు. అంతా అక్కడికి చేరుకున్నతర్వాత నిర్మాత చాలా ఇంపార్టెంట్ పనులు ఉండటం వల్ల రాలేకపోయారు. అయితే నిర్మాత అనగానే గణేష్ కాదు. అనఫీషియల్ నిర్మాత అయిన బొత్సా సత్యనారాయణ. ఆయన అనుకోకుండా వచ్చిపడ్డ ఓ పనివల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అయితే బ్యాంకాక్ లో నిర్మాతగా ఆయన కనపడాల్సిన అవసరం ఉండటంతో ఈ అవాంతరం వచ్చిపడింది. దాంతో ఆంజనేయులు టీమ్ తిరిగి వస్తున్నారని తెలుస్తోంది.
More from Filmibeat
anjaneyulu ravi teja nayantara yuvatha parasuram bangkok ganesh bosta satyanarayana రవితేజ నయనతార పరుశరామ్ ఆంజనేయులు బ్యాంకాక్


Click it and Unblock the Notifications











