Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
Brahmāstra 1 షాకింగ్ లీక్.. మరో అగ్ర హీరో కూడా.. వానర అస్త్రం అంటూ ఫొటోస్ వైరల్
బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో భారీ బడ్జెట్ తో తనకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు ముగించుకొని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఓవర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్ ట్రైలర్స్ అలాగే కొన్ని సాంగ్స్ కూడా అంచనాల స్థాయిని పెంచేసాయి.
దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా ఒక విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా దర్శకుడు రాజమౌళి కూడా ఇదివరకే తెలియజేశాడు. రాజమౌళి స్వయంగా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న ఒకటాక్ ప్రకారం అయితే సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో మరొక బాలీవుడ్ హీరో కనిపించబోతున్నట్లుగా టాక్ అయితే వస్తోంది.
ఆ హీరో షారుఖాన్ అని కూడా అంటున్నారు. షారుక్ ఖాన్ ఈ సినిమాలో ఒక వానర వస్త్రంగా కనిపించబోతున్నాడని అతని పాత్ర సినిమా చివరలో చాలా ట్విస్ట్ తో ఎంట్రీ ఇస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో అనే విషయం తెలియదు కానీ కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ రన్బీర్ కపూర్ కు ఒక గురువు పాత్రలో కనిపించబోతుండగా మరొక బలమైన శక్తి పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. ఇక వీలైనంత త్వరగా సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా తెలుగులో మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇదివరకే రెండు మూడు సార్లు రణ్బీర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా స్పెషల్ గా మీడియా మీట్స్ తో సినిమా గురించి తెలియజేశాడు. అలాగే ఒక ఈవెంట్ కూడా నిర్వహించాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.