Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Pushpa 2 కోసం సరికొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్న సుకుమార్.. మరో స్టార్ హీరోయిన్?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా 100 కోట్ల మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం విశేషం. అసలు సినిమా సక్సెస్ అవుతుందా కాదా అని ఎన్నో అనుమానాలు కలుగుతున్నా ఆ సమయంలో పుష్ప మొదటి భాగం హిందీ లోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం విశేషం. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యుల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటున్నారు. వీలైనంత వరకు మేకింగ్ విషయంలో కూడా చాలా మార్పులు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు.
అసలైతే పుష్పను కేవలం ఒకే భాగంలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిడివి ఎక్కువ కావడంతో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే విధంగా దర్శకుడు ఆలోచించాడు. అయితే అప్పుడే పుష్ప 2 షూటింగ్ 80 శాతం పైగా పూర్తయింది. ఇక మిగిలిన 20 శాతం కోసం దర్శకుడు వీలైనంత ఎక్కువ స్థాయిలో మేకింగ్ మార్చేందుకు చూస్తున్నాడు. అయితే ఈ సారి బాలీవుడ్ జనాలను కూడా ఎక్కువగా ఆకట్టుకునే విధంగా దర్శకుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ ను కూడా పుష్ప సెకండ్ పార్ట్ లో ముఖ్యమైన పాత్రలో చూపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫస్ట్ పార్ట్ లో నటించిన హీరోయిన్ రష్మిక మందన నటనకు మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.
ఇక ఈ బ్యూటీకి సంబంధించిన రెండో భాగంలో కూడా రష్మిక మందన్నకు సంబంధించిన సన్నివేశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయట. అయితే మరొక పవర్ఫుల్ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్రను చివర్లో వచ్చే ఒక ట్విస్ట్ తో పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారట. తప్పకుండా సినిమాలో ఆ క్యారెక్టర్ హైలెట్ అయ్యే విధంగా ఉంటుందట. అంతేకాకుండా మరికొంతమంది ప్రముఖ బాలీవుడ్ తారలను కూడా ఈ సినిమాలో భాగం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే దర్శకుడు సుకుమార్ సెకండ్ పార్ట్ కు సంబంధించిన మరికొన్ని సన్నివేశాలను కూడా రీ షూట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా మరొక ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పుష్ప సెకండ్ పార్ట్ పూర్తయిన తర్వాతనే మరొక ప్రాజెక్టు పై ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.