Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు.. మళ్ళీ మెగా హీరోనే పట్టేశారు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సుకుమార్ కేవలం తానే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని అనుకుంటాడు. తన శిష్యులను సుక్కు చాలా పవర్ఫుల్ గా రెడీ చేస్తున్నాడు. కుమారి 21F, ఉప్పెన సినిమాలతో సుకుమార్ స్టూడెంట్స్ పవర్ ఏమిటో చాలా ఈజిగా అర్దమయ్యింది.
అవమానాలు ఎదుర్కొని
ఆర్య సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుకుమార్ అంతకుముందు ఒక లెక్చరర్ గా వర్క్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక దర్శకుడు అవ్వాలని అనుకున్నప్పుడు ఎంతో మంది సీనియర్ దర్శకుల చుట్టూ తిరిగాడు. మొదట్లో కొంతమంది అవమానించారని సుకుమార్ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక ఫైనల్ గా దిల్ రాజు సపోర్ట్ తో వివి.వినాయక్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా మారి దిల్ సినిమాకు వర్క్ చేసిన సుకుమార్ ఆ తరువాత ఆర్య సినిమాతో మెప్పించాడు.
ఒక దర్శకుడు ప్లాప్ అనుకున్నప్పటికి
ఇక ఆ సినిమా తరువాత జగడం సినిమా తీశాడు. అయితే ఆ సినిమా నుంచి ఉన్న అసిస్టెంట్ దర్శకులు ఇప్పటికి సుకుమార్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఇక జగడం సినిమా నుంచి సుకుమార్ తో ఉన్న ప్రతాప్ సుకుమార్ తో కుమారి 21F అనే సినిమా చేశాడు. ఈ దర్శకుడు అంతకుముందే కరెంట్ అనే సినిమాతో ప్లాప్ అందుకున్నప్పటికి సుకుమార్ మళ్ళీ పిలిచి తన టీమ్ లో చేర్చుకున్నాడు. ఇక అతను రంగస్థలం సినిమాకు కూడా అసిస్టెంట్ గా వర్క్ చేశాడు.
ఉప్పెన హిట్టవ్వడంతో
ఇక ఆర్య 2 నుంచి వస్తున్న బుచ్చిబాబుకు సొంత ప్రొడక్షన్ లోనే ఛాన్స్ ఇచ్చాడు సుకుమార్. మైత్రి మూవీతో కలిసి ఉప్పెన సినిమా తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్టవ్వడంతో ఇప్పుడు బుచ్చిబాబు పేరు మారుమ్రోగిపోతోంది. అతనికి బయట ప్రొడ్యూసర్స్ నుంచి అవకాశాలు వస్తున్నా కూడా మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ లోనే సినిమా చేయబోతున్నాడు.
మరొక శిష్యుడు కూడా
ఇక జయంత్ అనే మరొక శిష్యుడు కూడా సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్తీక్ వర్మ దండు సాయితో థ్రిల్లర్ సినిమాను స్టార్ట్ చేశాడు. అతను కూడా సుక్కు శిష్యుడే. ఇక ఇప్పుడు జయంత్ కోసం మరొక మెగా హీరో సాయిని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు సమాచారం.