Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు.. మళ్ళీ మెగా హీరోనే పట్టేశారు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సుకుమార్ కేవలం తానే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని అనుకుంటాడు. తన శిష్యులను సుక్కు చాలా పవర్ఫుల్ గా రెడీ చేస్తున్నాడు. కుమారి 21F, ఉప్పెన సినిమాలతో సుకుమార్ స్టూడెంట్స్ పవర్ ఏమిటో చాలా ఈజిగా అర్దమయ్యింది.
అవమానాలు ఎదుర్కొని
ఆర్య సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుకుమార్ అంతకుముందు ఒక లెక్చరర్ గా వర్క్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక దర్శకుడు అవ్వాలని అనుకున్నప్పుడు ఎంతో మంది సీనియర్ దర్శకుల చుట్టూ తిరిగాడు. మొదట్లో కొంతమంది అవమానించారని సుకుమార్ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక ఫైనల్ గా దిల్ రాజు సపోర్ట్ తో వివి.వినాయక్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా మారి దిల్ సినిమాకు వర్క్ చేసిన సుకుమార్ ఆ తరువాత ఆర్య సినిమాతో మెప్పించాడు.
ఒక దర్శకుడు ప్లాప్ అనుకున్నప్పటికి
ఇక ఆ సినిమా తరువాత జగడం సినిమా తీశాడు. అయితే ఆ సినిమా నుంచి ఉన్న అసిస్టెంట్ దర్శకులు ఇప్పటికి సుకుమార్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఇక జగడం సినిమా నుంచి సుకుమార్ తో ఉన్న ప్రతాప్ సుకుమార్ తో కుమారి 21F అనే సినిమా చేశాడు. ఈ దర్శకుడు అంతకుముందే కరెంట్ అనే సినిమాతో ప్లాప్ అందుకున్నప్పటికి సుకుమార్ మళ్ళీ పిలిచి తన టీమ్ లో చేర్చుకున్నాడు. ఇక అతను రంగస్థలం సినిమాకు కూడా అసిస్టెంట్ గా వర్క్ చేశాడు.
ఉప్పెన హిట్టవ్వడంతో
ఇక ఆర్య 2 నుంచి వస్తున్న బుచ్చిబాబుకు సొంత ప్రొడక్షన్ లోనే ఛాన్స్ ఇచ్చాడు సుకుమార్. మైత్రి మూవీతో కలిసి ఉప్పెన సినిమా తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్టవ్వడంతో ఇప్పుడు బుచ్చిబాబు పేరు మారుమ్రోగిపోతోంది. అతనికి బయట ప్రొడ్యూసర్స్ నుంచి అవకాశాలు వస్తున్నా కూడా మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ లోనే సినిమా చేయబోతున్నాడు.
మరొక శిష్యుడు కూడా
ఇక జయంత్ అనే మరొక శిష్యుడు కూడా సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్తీక్ వర్మ దండు సాయితో థ్రిల్లర్ సినిమాను స్టార్ట్ చేశాడు. అతను కూడా సుక్కు శిష్యుడే. ఇక ఇప్పుడు జయంత్ కోసం మరొక మెగా హీరో సాయిని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లు సమాచారం.