Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ కథ అదుర్స్, కానీ.. జక్కన్న చూపు ఆ ముద్దుగుమ్మలపైనేనా!
Recommended Video
సౌత్ లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం కోసం రంగం సిద్ధం అవుతోంది. రాజమౌలి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటించబోతున్నారు. నవంబర్ లోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అన్ని పక్కాగా ఉండేలా రాజమౌళి చూసుకుంటున్నారు. అందుకే షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర కథ విషయంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.
బ్రిటిష్ కాలం నటి కథ
రాజమౌళి చిత్రాలెప్పుడూ విభిన్న కథలతో తెరకెక్కుతుంటాయి. ఆ తరహా కథలని విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తుంటారు. రాజమౌళి కోరిక మేరకు బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ చిత్రం కోసం విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
స్వాతంత్ర పోరాటం
ఈ చిత్రం స్వాతంత్ర పోరాటం గురించి కాకపోయినా ఆ చాలు మాత్రం ఉంటాయని వార్తలు వస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా సెట్స్ నిర్మించబోతున్నారు.
అయినా అసంతృప్తి
క్లైమాక్స్ విషయంలో మాత్రం రాజమౌళి అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ లో మార్పులు చేర్పులపై చర్చలు జరుగుతున్నాయట. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్లు వాళ్ళిద్దరేనా
ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. హాట్ బ్యూటీ పూజా హెగ్డేని కూడా సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మోద్దాం వ్యవహారంపై రాజమౌళి కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన రావలసి ఉంది.
బిజీగా చరణ్, ఎన్టీఆర్
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో నటిస్తున్నాడు. ఇక రాంచరణ్ బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి షూటింగ్ ప్రారంభించే సమయానికి ఈ రెండు చిత్రాలు పూర్తి కానున్నాయి.