Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
స్పీడ్ పెంచిన ప్రభాస్ టీమ్.. రాదేశ్యామ్ స్పెషల్ అప్డేట్ రెడీ
రెబల్ స్టార్ ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా పాన్ ఇండియా కాన్సెప్ట్ లను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాహుబలి హీరో లైనప్.. అతని కెరీర్ కు మరో మేజర్ ప్లస్ పాయింట్ లా మారనుందని చెప్పవచ్చు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ను విడుదల చేయగా దానికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాధేశ్యామ్ సినిమా యొక్క ఫస్ట్ సాంగ్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మార్చ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. అది కుదరకపోతే ప్రత్యేకంగా మరొక స్పెషల్ టీజర్ ను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాను జులై 30న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
2018లో సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా రెండేళ్లకు పైగా షూటింగ్ దశలోనే ఉంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అప్డేట్స్ అయితే చాలా పూర్ గా ఉన్నాయని అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే సాంగ్స్ రిలీజ్ చేస్తారని ఇన్ సైడ్ టాక్. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోగానే వెంటనే మరో సినిమా షూటింగ్ లతో ప్రభాస్ బిజీ కానున్నాడు. లాక్ డౌన్ లోనే షూటింగ్స్ విషయాల్లో ప్రభాస్ పక్కా ప్లాన్ తో రెడీ చేసుకున్నాడట. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే.