Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆ ఇద్దరు భామలతో రొమాన్స్.. డబుల్ డోస్లో మంచు విష్ణు రచ్చ
మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో 13ఏళ్ల క్రితం వచ్చిన 'ఢీ' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఢీ సినిమా అనేది అప్పట్లో ఓ సక్సెస్ ఫార్మూలా. ఢీ సినిమాను ఆధారంగా చేసుకుని అప్పట్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో దాదాపు అన్నీ కూడా హిట్లే. అయితే మళ్లీ ఇన్నేళ్లకు ఆ కాంబో సెట్ అయిన సంగతి తెలిసిందే. 'ఢీ'కి సీక్వెల్గా 'డి & డి''డబుల్ డోస్' అంటూ అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఢీ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన శ్రీహరి, జయప్రకాష్ రెడ్డి పాత్రలకు ఆల్టర్నేట్గా ఇంకా ఎవ్వరినీ ఫిక్స్ చేయలేదు గానీ హీరోయిన్లను మాత్రం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. విష్ణుకు జోడీగా ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్యా జైస్వాల్ నటించనున్నారని సమాచారం. ఇక ఎంతో ముఖ్యమైన ఆ రెండు క్యారెక్టర్లు ఎవరు పోషిస్తారో చూడాలి.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై మంచు విష్ణు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గోపీమోహన్, మరో పాపులర్ రైటర్ కిషోర్ గోపు స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తున్నారు. మహతి సాగర్ సంగీతం సమకూరుస్తుండగా, మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఇటు విష్ణు, అటు శ్రీను వైట్ల ఫాంలోకి వస్తారో లేదో చూడాలి.