Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ ఇద్దరు భామలతో రొమాన్స్.. డబుల్ డోస్లో మంచు విష్ణు రచ్చ
మంచు విష్ణు, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో 13ఏళ్ల క్రితం వచ్చిన 'ఢీ' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఢీ సినిమా అనేది అప్పట్లో ఓ సక్సెస్ ఫార్మూలా. ఢీ సినిమాను ఆధారంగా చేసుకుని అప్పట్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో దాదాపు అన్నీ కూడా హిట్లే. అయితే మళ్లీ ఇన్నేళ్లకు ఆ కాంబో సెట్ అయిన సంగతి తెలిసిందే. 'ఢీ'కి సీక్వెల్గా 'డి & డి''డబుల్ డోస్' అంటూ అఫీషియల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఢీ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన శ్రీహరి, జయప్రకాష్ రెడ్డి పాత్రలకు ఆల్టర్నేట్గా ఇంకా ఎవ్వరినీ ఫిక్స్ చేయలేదు గానీ హీరోయిన్లను మాత్రం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. విష్ణుకు జోడీగా ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్యా జైస్వాల్ నటించనున్నారని సమాచారం. ఇక ఎంతో ముఖ్యమైన ఆ రెండు క్యారెక్టర్లు ఎవరు పోషిస్తారో చూడాలి.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై మంచు విష్ణు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గోపీమోహన్, మరో పాపులర్ రైటర్ కిషోర్ గోపు స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తున్నారు. మహతి సాగర్ సంగీతం సమకూరుస్తుండగా, మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఇటు విష్ణు, అటు శ్రీను వైట్ల ఫాంలోకి వస్తారో లేదో చూడాలి.