Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగా హీరోలతో చేశా.. తప్పు అక్కడే జరిగింది.. షాకిచ్చిన క్రేజీ బ్యూటీ
సినీ ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో.. ఏ ఆఫర్స్ అంగీకరిస్తే కెరీర్ ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న హీరోయిన్ ఒక్కసారిగా డీలా పడటం, కేవలం ఒకటి రెండు సినిమాలతోనే కొందరు స్టార్ హీరోయిన్ క్రెడిట్ కొట్టేయడం చూస్తుంటాం. ఈ కోవలోనే మొదటి వర్గానికి చెందిన బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్.
మజ్ను సినిమాలో టాలీవుడ్ గడప తొక్కిన ఈ కేరళ బ్యూటీ.. వచ్చి రాగానే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ వెంటనే వరుస అవకాశాలు పట్టేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా అలరించింది. కానీ ఇంతలో ఊహించని విధంగా అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ స్లో కావడం ఆశ్చర్యానికి గురి చేసింది.
యూత్ ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ తొలినాళ్ల లోనే మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ పట్టేసింది. పవన్ కళ్యాణ్తో 'అజ్ఞాతవాసి', అల్లు అర్జున్ తో 'నా పేరు సూర్య' లాంటి సినిమాల్లో రొమాన్స్ చేసింది. కానీ ఈ సినిమాల ఎఫెక్ట్ ఆమెపై ఏ మాత్రం కనిపించలేదు. దీంతో రియలైజ్ అయిన ఆమె.. ఇప్పుడు చేసిన తప్పుపై ఫోకస్ పెట్టింది.
సినిమా కథల విషయంలో పెద్దగా దృష్టి పెట్టకుండా ఓకే చేయడం వల్లనే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని సన్నిహితుల వద్ద చెప్పుకుంటోందట అనూ ఇమ్మాన్యుయేల్. ఈ సారి తెలుగు నుంచి అవకాశం వస్తే.. కథ, క్యారెక్టర్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానని చెబుతోంది అనూ. చూడాలి మరి అనూ కెరీర్ ఇకనైనా దారిలో పడుతుందో.. లేదో!.