Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
క్రేజ్ తగ్గిన అనుష్కకి ఇక్కడ దక్కనిది అక్కడ దక్కేనా..!?
ప్రస్తుతం టాలీవుడ్ కొత్త హీరోయిన్ లు రిచా గంగోపాధ్యాయ, తాప్సీ, సమంత తదితర హీరోయిన్ లతో కళకళలాడిపోతోంది. దాంతో ఇప్పటికే చాలా మంది దర్శక, నిర్మాతల దష్టి వీరిపై పడిందట. ఇక టాలీవుడ్ లో అనుష్క పనైపోయినట్టేనని, కేవలం ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి చేయడం వరకే పరిమితమవ్వాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
అనుష్క చేసిన రెండు చిత్రాలు ఇటీవల వెంటవెంటనే విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. 'పంచాక్షరి",'వేదం"..ఈ రెండు చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టి మరిన్ని సినిమాలు చేసేలా చేస్తాయని అనుష్క భావించిందట. కానీ ఈ రెండు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా అనుష్క క్రేజ్ తగ్గిందని పరిశీలకులు అంటున్నారు.
ఆ విషయాన్ని అనుష్క కూడా అర్థం చేసుకుని కోలీవుడ్ పై దష్టిపెట్టాలనుకుంటోందట. అక్కడ సూర్య సరసన ఆమె చేసిన 'సింగమ్" చిత్రం హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ ను క్యాష్ చేసుకుని తన ఖాతాలో మరి కొన్ని తమిళ సినిమాలు పడేలా చేసుకోవాలనుకుంటోందట అనుష్క. మరి అక్కడైనా కావలసింది దక్కుతుందో లేదో చూడాలి మరి.