Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'వేదం' చిత్రంతో అనుష్క బాగా నష్టపోయిందా?
అమలాపురం సరోజగా 'వేదం' చిత్రంలో చేసిన అనుష్క డబ్బులు పరంగా చాలా లాసయిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. వారు చెప్పుకునేదాని ప్రకారం అనుష్క డేట్స్ ని వేదం నిర్మాతలు నలభై రోజులు అడిగారు. దానికి అనుష్క ఓకే చెప్పి తన రెమ్యునేషన్ చిత్రానికి కోటి ఇరవై లక్షలని చెప్పింది. దానికి నిర్మాతలు అంత బేర్ చేయలేమని నలభై లక్షలు ఇస్తామని అన్నారు. అయితే అనుష్క దానకి ఒప్పుకోలేదు. బేరసారాలు జరిగాక నిర్మాతలు ఆమె చెప్పిన రేటుకే ఒప్పుకుని అయితే ఏ రోజుకి ఆ రోజు చొప్పున డేట్స్ ని బట్టి ఇస్తామన్నారు. సరేనన్న అనుష్క తనకు ఏ విధంగానయితే కోటి ఇరవై లక్షలు ముట్టడం ముఖ్యమనుకుంది. కానీ నిర్మాతలు..దర్శకుడు క్రిష్ తో కలిసి డేట్స్ కరెక్ట్ గా ప్లాన్ చేసి కేవలం పందొమ్మిది రోజుల్లో ఆమె పాత్రను ఫినిష్ చేసారు. దాంతో ఆమెకు 57 లక్షలు మాత్రమే ముట్టింది. ఆశించిన మిగతా సొమ్ము గురించి మాట్లాడటానికి కూడా లేకుండా పోయింది. అయితే ఈ చిత్రంతో వచ్చిన పేరు పోగొట్టుకున్న సొమ్ముతో పోలిస్తే చాలా ఎక్కవ కాబట్టి హ్యాపీ అని తన సన్నిహితులతో చెప్తోందిట. అదీ సంగతి.