Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ - క్రిష్ సినిమాలో మరో హీరో: మొఘల్ చక్రవర్తిగా స్టార్ యాక్టర్.. అతడి రాకకు కారణమిదే!
రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల కోసం చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న అతడు.. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న 'వకీల్ సాబ్' మూవీతో కమ్బ్యాక్ అవుతున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న సినిమా ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అది కూడా మొఘల్ చక్రవర్తి పాత్ర అని తెలుస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
పవన్ కెరీర్లో తొలిసారి అలాంటి సినిమా
సుదీర్ఘమైన కెరీర్లో పవన్ కల్యాణ్ ఎన్నో చిత్రాల్లో నటించాడు. అయితే, కెరీర్లో తొలిసారి పిరియాడిక్ జోనర్లో మూవీ చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
టాలీవుడ్లోనే ప్రతిష్టాత్మకం... ఆ రోల్లో
పవన్ కల్యాణ్ క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దీని కోసం నిర్మాత ఏఎమ్ రత్నం ఏకంగా రూ. 180 కోట్లు ఖర్చు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంచనాలకు అనుగుణంగానే ఎంతో రిచ్గా తీస్తున్నారని తెలుస్తోంది. ఇక, ఈ భారీ బడ్జెట్ సినిమాలో పవన్ కల్యాణ్.. వజ్రాల దొంగగా నటిస్తున్నాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
Recommended Video
సినిమా కోసం సాహసాలు.. ఇష్టమైందేగా
కెరీర్లోనే తొలిసారి పిరియాడిక్ జోనర్లో సినిమాను చేస్తున్న పవన్ కల్యాణ్.. దీని కోసం ఎన్నో సాహసాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాములు కూడా చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు, అతనకెంతో ఇష్టమైన గన్ షూటింగ్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది. ఇక, ఇందులో విగ్గుతో కనిపించబోతున్నాడట.
ఆ విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు
పిరియాడిక్ జోనర్ సినిమా కావడంతో దీనికి 'విరూపాక్ష' అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత 'ఓం శివమ్' అనే పేరు పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇక, ఈ మధ్య 'హర హర వీరమల్లు' అనే టైటిల్ పరిశీలనలో ఉందని అన్నారు. దీనితో పాటు 'హరహర మహాదేవ' అనే టైటిళ్లను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించారట దర్శక నిర్మాతలు.
పవన్ - క్రిష్ సినిమాలో మరో స్టార్ హీరో
టాలీవుడ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్తో రాబోతున్న చిత్రాల్లో ఒకటైన దీని కోసం క్రిష్ జాగర్లమూడి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే ఈ సినిమాలో మరో స్టార్ హీరోను కూడా నటింపజేయాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ 27వ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ను ఎంపిక చేసుకున్నారట.
మొఘల్ చక్రవర్తిగా స్టార్... కారణం ఇదే
ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యం నాటి కథతో రూపొందుతోంది. దీంతో అప్పటి చక్రవర్తి ఔరంగజేబు పాత్ర ఎంతో కీలకం. అందుకే ఈ పాత్ర కోసం అర్జున్ రాంపాల్ను తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్లో క్రిష్కు ఉన్న పరిచయాలతోనే ఆయనను ఒప్పించారని తెలుస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని హిందీలోకీ తీసుకెళ్లే ఆలోచన ఉండబట్టే ఈ స్టార్ను తీసుకున్నారని సమాచారం.