Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చిరంజీవిపై కయ్యానికి కాలు దువ్వుతోన్న సీనియర్ హీరో.. భీకర పోరు గ్యారెంటీ.!
రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కమ్బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన 'సైరా: నరసింహారెడ్డి' మాత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమాను ప్రకటించారు.
కొరటాల దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న చిత్రం 'ఆచార్య'. కొణెదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. తన ప్రతి సినిమాలనే ఇందులోనూ ఓ మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాడట డైరెక్టర్ కొరటాల శివ. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాడే నక్సలైట్గా ఈ మూవీలో చిరంజీవి కనిపించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక, ఈ సినిమాలో నటించే విలన్ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ పాత్ర కోసం ఆ మధ్య పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ నటుల పేర్లు వినిపించినప్పటికీ.. ఎవరినీ ఫైనల్ చేయలేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద స్వామి ప్రతినాయకుడిగా నటిస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది.
గతంలో అరవింద స్వామి ఎన్నో సినిమాల ద్వారా తెలుగు వారికి చేరువయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య రామ్ చరణ్ నటించిన 'ధృవ'లో విలన్గా నటించి మెప్పించారు. ఇప్పుడు మరోసారి మెగా హీరో సినిమాలోనే నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి వీళ్లిద్దరి పోరు ఎలా ఉంటుందో.!