Don't Miss!
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
రూ. 10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్న రామ్ చరణ్?
హైదరాబాద్: మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగా నిర్మాత అశ్వినీదత్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అశ్వినీదత్ రామ్ చరణ్కు ఫుల్ పేమెంట్ రూ. 10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఏదో ఒక సినిమా తన బేనర్లో చేయాలనే కమిట్మెంటు తోనే ఈ మొత్తం ముట్టజెప్పినట్లు సమాచారం.
అశ్వినీదత్ గత కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. అతని చివరి చిత్రం 'శక్తి' భారీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో మళ్లీ హిట్ చిత్రాలతో తన ఎంట్రీని చాటు కోవాలని చూస్తున్నాడు ఈ భారీ నిర్మాత. ఇందులో కొన్ని చిత్రాలకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు శ్రీను వైట్లకు రూ. 5 కోట్ల అడ్వాన్స్ అందినట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈచిత్రానికి స్క్రిప్టు అందించనున్నారు.
మరో వైపు కొన్ని రోజుల క్రితమే అశ్వినీదత్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రానికి సీక్వెల్ తీయనున్నట్లు వెల్లడించారు. రామ్ చరణ్ హీరోగా ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని అంటున్నా ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం అశ్వినీదత్ తన వై జయంతి మూవీస్ బేనర్పై రవితేజ హీరోగా 'సార్ వస్తారా' చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటు మహేష్, క్రిష్ కాంబినేషన్లో కూడా అశ్వినీదత్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు.