ఇబ్బందే అయినా...నాగార్జునకి తప్పదు కదా
హైదరాబాద్: ఓ సినిమా హిట్టైంది లేదా రిలీజ్ అవుతోంది అంటూ ప్రెస్ మీట్ లు పెట్టి మీడియాతో మాట్లాడటం ఉత్సాహంగా ఉంటుంది. అదే మా సినిమా ఫలానా కారణంతో లేటు అయ్యింది అని చెప్పటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయాలంటే కాస్త ఇబ్బందే. అయినా నాగార్జున సిద్దపడుతున్నారని తెలుస్తోంది. తన కుమారుడు నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య చిత్రం జూన్ 27న విడుదల కాబోతూండటంతో..చిత్రం ఆలస్యానికి కారణం మీడియా ముఖంగా వివరించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోలో ఈ రోజు(గురువారం) మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అలాగే నాగార్జునే స్వయంగా పూనుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు సమాచారం.
నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'ఆటో నగర్ సూర్య'. దేవాకట్టా దర్శకత్వం వహించారు. ఎన్నో రోజులుగా వాయిదాలు పడుతూ,అసలు విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు రేకిత్తించిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల్లోలనే విడుదలకు సిద్దమైంది. జూన్ 27న ఈ చిత్రం విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియచేసారు.

దేవకట్టా మాట్లాడుతూ... సూర్య.. విజయవాడ ఆటోనగర్లో చేయితిరిగిన మెకానిక్. అతడు అనాథ కానీ..అనామకుడు కాదు. అతడి ప్రపంచంలో మాటకు మాట...దెబ్బకు దెబ్బే సమాధానం. అలాంటి యువకుడు ఓ పవర్ఫుల్ రాజకీయనాయకుడితో ఢీ కొంటే ఎలాంటి పరిణామాలు సంభవించాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు . ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్ఇండియా పతాకంపై కె. అచ్చిడ్డి నిర్మిస్తున్నారు.
నాగచైచతన్య మాట్లాడుతూ... సమాజంలో నాలుగే జాతులు ఉన్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాళ్లు, కనీసం తిన్నంత పండించుకునేవాళ్లు, పండించలేక అడుక్కుతినేవాళ్లు ఉన్నారు. ఈ ముగ్గుర్ని దోచుకుతినే నాలుగో జాతి కూడా ఉంది. అదే లోఫర్ జాతి. అలాంటి వాళ్లమీదే 'సూర్య' ప్రతాపం చూపిస్తాడు అంటున్నారు నాగచైతన్య.
నిర్మాత మాట్లాడుతూ...''ప్రస్తుత సమాజ పరిస్థితులపై ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంలోని సంభాషణలకు మంచి స్పందన వస్తోంది '' . బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్రెడ్డి, ఎమ్మెస్నారాయణ, రఘుబాబు తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, కళ: రవీందర్.


Click it and Unblock the Notifications











