Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అవసరాల శ్రీనివాస్ మంచి ఛాన్సే కొట్టాడు
హైదరాబాద్ :‘ఊహలు గుసగుసలాడే'చిత్రంతో దర్శకుడుగా లాంచ్ అయిన అవసరాల శ్రీనివాస్ తన తదుపరి చిత్రానికి మంచి హీరోనే సంపాదించాడని తెలుస్తోంది. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నాగచైతన్యతో అవసరాల తన తదుపరి చిత్రం చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అవసరాల ని లాంచ్ చేసిన వారాహి చలన చిత్రం వారే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోందని అంటున్నారు.
నాగ చైతన్య తాజా చిత్రం విషయానికి వస్తే...
నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'ఒక లైలా కోసం'. విజయ్కుమార్ కొండా దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించారు. చిత్రాన్ని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు
. ''టామ్ అండ్ జెర్రీలా నిత్యం గొడవపడే అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ ఈ చిత్రం. వాళ్లు ప్రేమలో పడిన వైనం, గొడవల్లో పండే వినోదం చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది'' అంటున్నారు దర్శకుడు.
అలాగే... 'మనం'లో రాధా మోహన్గా, నాగార్జునగా రెండు విభిన్న పాత్రలతో అలరించారు నాగచైతన్య. ఇప్పుడు మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'స్వామి రా రా' దర్శకుడు సుధీర్వర్మ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారురు. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
నాగచైతన్య మాట్లాడుతూ ''స్వామి రా రా' నాకెంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత ఆ చిత్ర దర్శకుడు సుధీర్వర్మతో పని చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది. '' అన్నారు.
''అన్ని వర్గాలను అలరిస్తూ నా తరహాలో సాగే సినిమా ఇది. నాగచైతన్య పాత్ర కొత్తగా ఉంటుంది'' అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ ''సుధీర్వర్మ చెప్పిన కథ చాలా బాగుంది. నాగచైతన్యను కొత్త తరహాలో చూపించే చిత్రమిది''అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేశ్ ఇప్పటివరకూ ఎంపికైన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నారాయణరెడ్డి.