twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి-2’ ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ మధ్య కాలంలో లీక్ వ్యవహారాలు సినిమా ఇండస్ట్రీని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ ముందే సినిమాలోని క్లిప్స్ లీక్ కావడం, స్టోరీ లీక్ కావడం, కొన్ని సార్లు సినిమా మొత్తం లీక్ కావడం లాంటివి జరుగుతున్నాయి.

    ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తృతంగా వినియోగిస్తున్న ఈ రోజుల్లో అత్యంత వేగంగా ఈ లీక్ స్టఫ్ అందరికీ షేర్ అవుతోంది. తాజాగా బాహుబలి-2 కథ లీకైందంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. వాట్సాఫ్, ఫేస్ బుక్ ద్వారా ఇది వైరల్ అయింది.

    అసలు ఇది నిజంగానే బాహుబలి-2 స్టోరీ అవునో? కాదో? చెప్పడం కష్టమే కానీ.... ఇది నిజమే అని నమ్మేలా ఉంది. ఆ స్టోరీపై మీరూ ఓ లుక్కేయండి.

    బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ తో మొదలు

    బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ తో మొదలు

    పార్ట్ -1 లో క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని వెన్ను పోటు పోడిచానని చెప్పటం తో పార్ట్ 1 పూర్తి అవుతుంది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడు ( ప్రభాస్ ) కి చెబుతాడు. కాలకేయ రాజ్యం మీద గెలిచి విజయ జెండా ఎగరవేసిన మహిస్మతి రాజ్యానికి రాజు గా అమరేంద్ర బాహుబలి అవుతాడు. మరో వైపు కన్న కొడుకు (భల్లలా దేవ ) కి అన్యాయం జరిగింది అని బిజ్జల దేవ (నాజర్ ) కోపం తో రగిలి పోతారు.

    అమరేంద్ర బాహుబలి పాలనలో

    అమరేంద్ర బాహుబలి పాలనలో

    అమరేంద్ర బాహుబలి పాలనా లో మహిస్మతి రాజ్యం సుఖ సంతోషాలతో బోగభాగ్యాలతో తులతూగుతుంటుంది. మహిస్మతి రాజ్యానికి కి దగ్గర లో ఉన్నా కుంతలా రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు దండెత్తు వుంటాయి. కుంతలా రాజ్యాన్ని ఎల్లప్పుడు కాపాడుకుంటుంది దేవసేన (అనుష్క ). ఆ రాజ్యం లో దేవసేన చెప్పిందే చట్టం...శత్రువు బలగాలు ని ఒంటి చేత్తో మట్టి కరిపించే ధైర్య శాలి. ఒక అనుకోని సంఘటన లో దేవసేన‌ని అమరేంద్ర బాహుబలి చూడటం తో అక్కడ నుండి వాళ్ళ మధ్య ప్రేమ మొదలు అవుతుంది. మరో వైపు ఆ విషయం తెలుసుకున్న భల్లలా దేవా కూడా అనుష్క ని ఇష్టపడతాడు.

    భల్లాల దేవ దేవసేనను ఇష్టపడతాడు

    భల్లాల దేవ దేవసేనను ఇష్టపడతాడు

    ఆ విషయం బిజ్జల దేవ కి తెలుస్తుంది. బిజ్జలా దేవ (నాజర్ ) కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు.. ఆ విషయం తెలుసుకున్న దేవసేన నిరాకరిస్తుంది. బిజ్జలా దేవ శివగామి తో సొంత కొడుకు అయిన భల్లలా దేవ ని రాజు ని చేస్తావని ఆ రోజు అన్నావు.... కానీ మాట తప్పావు.. ఇప్పుడు మన కొడుకు కి ఇష్టమైన ఆ దేవసేన ని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు అని తన లో వున్నా భాద ని శివగామి కి చెబుతాడు.

    విధేయుడిని కాపాడతాడు

    విధేయుడిని కాపాడతాడు

    ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానీ పరిస్థితి లో శివగామి ఆలోచన లో పడుతుంది. మరో వైపు మహిస్మతి రాజ్యం చేతి లో ఓడిపోయిన కాలకేయుడి తమ్ముడు నింజా (చరణ్ దీప్) పగతో రగిలిపోతుంటాడు. కుంతలా రాజ్యం నుండి విదేయుడు (సుబ్బరాజు ) వర్తమానాన్ని మహిస్మతి రాజ్యానికి తీసుకువస్తాడు. బిజ్జల దేవ పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరిస్తునట్టు విదేయుడు చెబుతాడు. ఆ సభలో భల్లలా దేవా కోపం తో విదేయుడు మీద దాడి చెయ్యటానికి దిగుతాడు. ఆ సమయం లో అమరేంద్ర బాహుబలి విదేయుడి (సుబ్బరాజు) కి అడ్డ వచ్చి విదేయుడిని కాపాడుతాడు.

    సభలో గొడవ

    సభలో గొడవ

    బిజ్జలా దేవా ఆ సభ లో మళ్ళి ఆ గొడవ ని రేపుతాడు. శివగామి అక్కడ జరుగుతుంది అంత చూస్తూ వుంటుంది. ఈ విషయం నా తల్లి శివగామి కి వదిలేస్తున్నానుఅని అమరేంద్ర బాహుబలి అంటాడు... సభ లో అంతా శివగామి తీర్పు కోసం అందరు ఎదురు చూస్తూ వుంటారు. శివగామి రాజ్యం కావాలా ....! ప్రేమ కావాలో .....! తేల్చుకోమని ఆ నిర్ణయం అమరేంద్ర బాహుబలి కి వదిలేస్తుంది.

    ప్రేమేకావాలంటాడు

    ప్రేమేకావాలంటాడు

    బాహుబలి చెప్పే సమాధానం కోసం అందరు ఎదురుచూస్తు వుంటారు. అమరేంద్ర బాహుబలి ప్రేమ కావాలని కోరుకుంటాడు.......బాహుబలి తీసుకున్న నిర్ణయం మహిస్మతి ప్రజలలో ఆందోళన మొదలు అవుతుంది. మహిస్మతి ప్రజలు అంత బాహుబలి రాజ్యం వదిలి వెళ్ళవద్దు అని వేడుకొంటారు.... మాకు బాహుబలి కావాలి అని. కానీ బాహుబలి మహిస్మతి ని వదిలి అరణ్య వాసం పడతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలి కి తోడూ గా వెళ్తుంది.

    దేవసేన గర్భం

    దేవసేన గర్భం

    బాహుబలి బౌద్ధ మటం లో వుంటూ అక్కడ వున్నా వాతావరణం లో దేవసేన ని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ వుంటాడు. మహిస్మతి రాజ్యం అంతా భల్లలా దేవా (రానా) ఆధీనం లోకి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న కాలకెయ్య రాజ్యానికి రాజు అయిన నింజా (చరణ్ దీప్) మహిస్మతి రాజ్యం మీద దాడి చెయ్యటానికి సువర్ణ అవకాశం దొరుకుతుంది. మరో వైపు దేవా సేన తల్లి అయ్యింది అని కుంతల రాజ్యం అందరికి తెలుస్తుంది.

    కాలకేయుడి చేతిలో ఓటమి

    కాలకేయుడి చేతిలో ఓటమి

    మరో వైపు మహిస్మతి రాజ్యం తో యుద్దానికి సిద్దం అవుతారు కాలకెయ్య సైన్యం అంతా. ఆ యుద్ధం లో మహిస్మతి రాజ్యానికి ( భల్లలా దేవ్ ) రానా నాయకత్వం వహిస్తాడు. ఆ యుద్ధ రణరంగ భూమి లో మొదటి రెండు దినాలు మహిస్మతి రాజ్యం లో సగం సైన్యం కాలకెయ్య చేతిలో నేల కూలతారు..... ఇంకో రెండు దినాల్లో మహిస్మతి రాజ్యం కుప్ప కూలిపోతుంది అని తెలుసుకున్న శివగామి బాహుబలి కి వర్తమానం పంపిస్తుంది.

    అమరేంద్ర బాహుబలిరాక

    అమరేంద్ర బాహుబలిరాక

    ఆ విషయం తెలుసుకున్న బాహుబలి తిరిగి తన బార్య తో కలసి మహిస్మతి రాజ్యానికి వస్తాడు. కుంతలా రాజ్యం మహిస్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది.... మరో వైపు బిజ్జల దేవా (నాజర్ ) బాహుబలి మళ్ళి తిరిగి వస్తే తన కొడుకు ని రాజ్యం నుండి తప్పిస్తారు అని తెలిసి భల్లలా దేవా, బిజ్జలా దేవా అనుకుంటారు..... ఒక వైపు కాలకెయ్య చేతిలో ఓడిపోతాం అన్న భయం లేకుండా, తన అన్న తిరిగి వచ్చాడు అన్న భయం ఎక్కువ కనిపిస్తుంది.

    కట్టప్ప వెన్నుపోటు

    కట్టప్ప వెన్నుపోటు

    మహిస్మతి రాజ్యన్ని ఎలాప్పుడు నమ్మిన బంటు గా పనిచేసే కట్టప్ప (సత్య రాజ్) ని రాజు చెప్పిందే వేదం అనుకుని బాహుబలి ని వెన్నుపోటు పొడవమని భల్లలా దేవ్, బిజ్జల దేవ్ చెబుతారు. కాలకెయ్య సైన్యం తో యుద్ధం కొనసాగుతుంది...ఆ యుద్ధం లో కాలకెయ్య సైన్యం అంత కుప్పకూలుతుంది. యుద్ధం జరుగుతున్న సమయం లో బాహుబలి ని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఆ యుద్ధ భూమి లో బాహుబలి చనిపోతాడు....

    భల్లాలదేవ క్రూరత్వం

    భల్లాలదేవ క్రూరత్వం

    మహిస్మతి రాజ్యం అంత ఆ వార్త విని శోక సంద్రం లో వుంటారు.... దేవా సేన 9 నెలలు గర్భవతి అవ్వటం వలన శివగామి అన్ని దగ్గర వుంది చూసుకుంటుంది... రానా బాహుబలి మీద వున్నా కోపం తో మహిస్మతి రాజ్యం లో వున్నా ప్రజలని హింస చూపిస్తాడు. తనని కాదని బాహుబలి ని పెళ్లి చేసుకున్న దేవసేన ని చెరసాల లో బంధిస్తాడు. దేవసేన కి పుట్టిన బిడ్డని శివగామి పెంచుతుంది. బాహుబలి వారసుడి ని చంపాలని అనుకుంటాడు కట్టప్ప ద్వారా ఆ విషయం శివగామి కి తెలుస్తుంది.

    బాహుబలి కొడుకును

    బాహుబలి కొడుకును

    బాహుబలి ని తన కొడుకు - భర్త కలసి చంపించారు అని శివగామి కి తెలుస్తుంది. భల్లలా దేవా బాహుబలి కొడుకుని చంపుదామని ప్లాన్ వేస్తాడు... ఆ విషయం తెలుసుకున్న శివగామి బాహుబలి కి పుట్టిన బిడ్డ తో రాజ్యం నుండి పారిపోతుంటే భల్లలా దేవా సైన్యం శివగామి ని చంపటానికి ట్రై చేస్తుంటారు ... ఆ పోరు లో శివగామి ఆ పిల్లవాడిని ఒక గుడిసె వాళ్ల అప్పగించి చనిపోతుంది..... అక్కడితో కట్టప్ప బాహుబలి కి జరిగిన అన్యాయం గురించి శివుడి కి చెబుతాడు

    శివుడిమీద పగ

    శివుడిమీద పగ

    భల్లలా దేవా శివుడు మీద పగ తో రగిలిపోతుంటాడు.... తన కొడుకు (బద్రుడు ) ని చంపిన శివుడు మీద పగ తో వున్నా భల్లాల దేవా, మరో వైపు తన భర్త (బాహుబలి) చావు కి కారణం అయిన భల్లల దేవ‌ని చంపుతాను అని శబథమ్ చేసిన దేవసేన కసి తో వుంటారు.... శివుడు తనకంటూ ఒక రాజ్యాని ఏర్పాటు చేసుకుంటాడు... ఆ రాజ్యం లో కుంతలా రాజ్యం తోడూ అవుతుంది.. శివుడి కి నమ్మిన బంటు గా కట్టప్ప వుంటే , వాళ్ళకి ఆయుధాలు సరపరా చేసే వ్యక్తిగా కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు. మహిస్మతి రాజ్యానికి, శివుడి కి మధ్య జరిగే పోరు లో మహిస్మతి రాజు అయిన భల్లలా దేవా శివుడు చేతిలో ఓడిపోతాడు

    శుభం కార్డు అలా

    శుభం కార్డు అలా

    మహిస్మతి రాజ్యం లో అందరు చూస్తుండగా భల్లలా దేవా (రానా ) ని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది.....ఆ బాధ తట్టుకోలేక బిజ్జలా దేవ కొడుకు చితిని చూస్తూ కన్ను ముస్తాడు....
    శుభం

    రిలీజ్ ఎప్పుడు?

    రిలీజ్ ఎప్పుడు?

    బాహుబలి-2 రిలీజ్ డేట్ ఆల్రెడీ ఖరారైంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    English summary
    Baahubali 2 leaked story viral social media. Baahubali: The Conclusion is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X