Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కనీ,వినీ రీతిలో ‘బాహుబలి’ ర్యాలి...పూర్తి డిటేల్స్
హైదరాబాద్ : రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కి రిలీజ్ కు రెడీ గా ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి'. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూలై 10న తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేఫధ్యంలో ప్రభాస్ అభిమానులు ఓ ర్యాలిని నిర్వహించాలని నిర్ణయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
‘బాహుబలి' విడుదల తేదీన అంటే 10 వ తేదిన... భీమవరంలో ఓ భారీ ర్యాలీ జరగనుందని తెలుస్తోంది. ప్రభాస్ ప్యాన్స్ చేసే ఈ ర్యాలీలో ..రెండు ఏనుగులు, 50 గుర్రాలు, వంద రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ లు, 1000 మందికి పైగా ప్రభాస్ అభిమానులు పాల్గొననున్నారు. అయితే ఈ విషయమై సెక్యూరిటీ ఏ స్దాయిలో ఎలా ఇవ్వాలి అనేదానిపై పై వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే పోలీసులు ఈ ర్యాలికి ఇప్పటికే ఫర్మిషన్ ఇచ్చి ఉన్నారు. అయితే కొందరు అనేదాని ప్రకారం ఏనుగులును ప్రక్కన పెట్టి..గుర్రాలను 5 కు లిమిట్ చేయమని పోలీసులు అడిగినట్లు చెప్పుకుంటున్నారు. రిలీజ్ రోజున కానీ ఈ ర్యాలి ఏ విధంగా జరుగుతుందో తెలియదు.
ఈ ఉదయం బాహుబలి సౌండ్ మిక్సింగ్కు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ హైలైట్గా అవనుంది. ఈ రోజుతో కీరవాణి తన పాత్రను పూర్తి చేశారు. మరో ప్రక్క హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో డీఐ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు.
ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. కీరవాణి సంగీతం అందించారు.