Pushpa 2: పుష్ప 2లో బాహుబలి రేంజ్ ట్విస్ట్ లీక్... బన్నీ కోసం సుక్కు భారీ స్కెచ్!
ఇండియన్ సినిమా హిస్టరీలో రాజమౌళి ప్రభాస్ కలయిక బహుబలి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. బాక్సాఫీస్ను షేక్ చేసి వందల కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ తొలి భాగంలో సినిమా మొత్తం ఓ రేంజ్ అయితే క్లైమాక్స్ మరో ఎత్తు. అదే సినిమాకు పెద్ద ట్విస్ట్. దాంతోనే సీక్వెల్పై భారీ అంచనాలు రేపి రెండో భాగంతోనూ హిట్ అందుకున్నారు. అయితే ఇప్పుడీ రేంజ్లో భారీ ట్విస్ట్ను దర్శకుడు సుకుమార్ తన పుష్ప 2 సినిమా కోసం వాడుకోబోతున్నట్లు లీక్ అయింది. దాని గురించే ఈ కథనం...
బాక్సాఫీస్ను శాసించడానికి పుష్ప రాజ్ ఈ ఏడాది ఆగస్టు 15న రాబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ పుష్ప: ది రైజ్కి కొనసాగింపుగా రెండో భాగం పుష్ప 2 రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. మొదటి భాగం నేషనల్ వైడ్లో ఆడియెన్స్ను విశేషంగా అలరించింది. మూవీలోని బన్నీ మేనరిజమ్, డైలాగ్స్ ఇంటర్నేషనల్ రేంజ్లో పాపులర్ అయ్యాయి. ఇందులోని నటనకిగానూ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా దక్కింది. అందుకే సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సౌత్ ఆడియన్స్తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరోసారి ఇంకో విషయం లీక్ అయింది. అదేంటంటే.. సినిమాలో పుష్పకు నమ్మిన బంటువుగా ఉంటాడు కేశవ. అతడి పాత్రకు కూడా మంచి క్రేజ్ దక్కింది. దీంతో రెండో భాగంలోనూ అతడి పాత్ర ఎంతో కీలకంగా ఉండేలా డిజైన్ చేశారని తెలిసింది.
కానీ ఈ మధ్య అతడు రియల్ లైఫ్ ఓ అనుమానస్పద యువతి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్కు కూడా కాస్త బ్రేక్ పడింది. దీంతో మూవీటీమ్ అతడి కోసం రూ.70లక్షల రూపాయలు(బయట సమాచారం) ఖర్చు చేసి మరీ బెయిల్పై బయటకు తీసుకొచ్చింది! అంటే అతడి పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు అతడి పాత్ర గురించే ఓ వార్త లీక్ అయింది. అతడే పుష్పను చంపబోతున్నట్టు తెలిసింది. సినిమా చివర్లో పుష్ప రాజ్ చనిపోతాడు అని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. చిత్రంలో పుష్పను ఎదురించే వారు ఉన్నా అతడిని చంపే సత్తా ఎవరికి ఉండదు. కాబట్టి పుష్పను చంపే వాడెవడు? అనే పాయింట్తో కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా చివర్లో ప్రలోభాలకు లోబడిన పుష్ప ఫ్రెండ్ కేశవే పుష్పను చంపేస్తాడు అని లీకైంది. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతానికి ఈ వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో బాహుబలి రేంజ్లో క్లైమాక్స్ రెడీ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ్ తదితరులు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం, మిరోస్లా క్యూబా బ్రోజెక్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.రామకృష్ణ, మోనిక. చంద్రబోస్ పాటల బాధ్యతను చూసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











