twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణతో ఎన్టీఆర్..అభిమానులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేస్తోంది?

    |

    నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే విషయం ఏదైనా ఉంది అంటే అది ఎన్టీఆర్ బాలకృష్ణ మల్టీస్టారర్ అనే విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుంది అనే విషయం తెలియదు కానీ అభిమానులు వారిద్దరూ కలిసి ఒకే స్టేజి మీద కనపడినా చాలనుకునే పరిస్థితి ఏర్పడింది. ముందు నుంచి కూడా వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఒకరి సినిమా వేడుకలకు హాజరు అవుతూ ఉండడంతో కాస్త అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ బహిరంగంగా కలిసి కనిపించకపోవడంతో మీరు ఎప్పుడు కలుస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వీరిద్దరు త్వరలోనే కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఆ వివరాల్లోకి వెళితే.

    తనదైన ట్రెండ్

    తనదైన ట్రెండ్

    నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. నట సింహ అనే బిరుదు తెచ్చుకుని అనేక సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరిగా ఇప్పటికి కొనసాగుతున్నారు. కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ విడుదల చేస్తూ టాలీవుడ్ లో తనదైన ట్రెండ్ సృష్టిస్తున్నారు.

    చిన్ననాటి నుంచి

    చిన్ననాటి నుంచి

    హరికృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం చిన్ననాటి నుంచి రికార్డులు బద్దలు కొట్టడం అలవాటు చేసుకున్నారు. 19 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ అనేక సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరిగా మారాడు. ఎక్కువగా రాజమౌళితో సినిమాలు చేసిన ఆయన ఇటీవల RRR సినిమా చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించాల్సి ఉంది.

    ఘనంగా శతజయంతి ఉత్సవాలు

    ఘనంగా శతజయంతి ఉత్సవాలు

    అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటి వారందరూ ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి నందమూరి కుటుంబం ప్లాన్ చేస్తోంది. 1923వ సంవత్సరంలో జన్మించిన ఎన్టీఆర్ కు 2023 వ సంవత్సరంలో ఘనంగా శతజయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు.

    బాలకృష్ణ ముఖ్య అతిథిగా

    బాలకృష్ణ ముఖ్య అతిథిగా

    అందులో భాగంగా ఈ ఏడాది మే 28వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. మే 28వ తేదీన నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్ స్వగ్రామం అయిన నిమ్మకూరులో ఈ ఉత్సవాలు ప్రారంభిస్తారని తెలుస్తోంది. బాలకృష్ణ ముఖ్య అతిథిగా ప్రారంభిస్తారు కానీ కుటుంబ సభ్యులు అందరూ హాజరు అయ్యేలాగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.

    చాలా కాలం తర్వాత

    చాలా కాలం తర్వాత

    అందులో భాగంగానే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న అలాగే మిగతా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిమానులు మాత్రం చాలా కాలం తర్వాత నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కలవనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సహా మిగతా కుటుంబ సభ్యుల హాజరుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

    English summary
    Balakrishna and Ntr along with the Nandamuri family to meet at nimmakuru for NTR sathajayanthi utsavalu curtain raiser event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X