Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హ్యాండిచ్చిన మెహర్ రమేష్...బాలయ్య ఆగ్రహం!?
మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని, మెహర్ ఇప్పుడు ఎన్టీఆర్ తో 'శక్తి' చేస్తున్నాడు కాబట్టి..అది పూర్తయ్యాక నాతో ఉంటుందని బాలకృష్ణ ఆ మధ్య ఎంతో ఉత్సాహంతో ఇంటర్వూలలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయనే మండిపడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానికి కారణం...మెహర్ రమేష్ ఇటు బాలకృష్ణ తో సినిమా చేస్తానని చెప్పి మరో ప్రక్క మహేష్ కి వెళ్ళి స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. అంతేగాక ఆ చిత్రానికి కానూ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నుంచి భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకున్నారు. ఇదంతా తెలిసిన బాలకృష్ణ కోపంతో ఉన్నారని సమాచారం. ఇక మెహర్ రమేష్ ఇంతుకుముందు ఎన్టీఆర్ తో కంత్రి చిత్రాన్ని రూపొందించారు. అలాగే ప్రభాస్ తో భిళ్లా డైరక్ట్ చేసారు. ఇప్పుడు అశ్వనీదత్ బ్యానర్ లో శక్తి చేస్తున్నారు. అలాగే సింహా విజయంతో ఉన్న బాలకృష్ణ..దాసరి తో పరమవీర చక్ర, పరుచూరి మురళితో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.