Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హ్యాండిచ్చిన మెహర్ రమేష్...బాలయ్య ఆగ్రహం!?
మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచన ఉందని, మెహర్ ఇప్పుడు ఎన్టీఆర్ తో 'శక్తి' చేస్తున్నాడు కాబట్టి..అది పూర్తయ్యాక నాతో ఉంటుందని బాలకృష్ణ ఆ మధ్య ఎంతో ఉత్సాహంతో ఇంటర్వూలలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయనే మండిపడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానికి కారణం...మెహర్ రమేష్ ఇటు బాలకృష్ణ తో సినిమా చేస్తానని చెప్పి మరో ప్రక్క మహేష్ కి వెళ్ళి స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. అంతేగాక ఆ చిత్రానికి కానూ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నుంచి భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా తీసుకున్నారు. ఇదంతా తెలిసిన బాలకృష్ణ కోపంతో ఉన్నారని సమాచారం. ఇక మెహర్ రమేష్ ఇంతుకుముందు ఎన్టీఆర్ తో కంత్రి చిత్రాన్ని రూపొందించారు. అలాగే ప్రభాస్ తో భిళ్లా డైరక్ట్ చేసారు. ఇప్పుడు అశ్వనీదత్ బ్యానర్ లో శక్తి చేస్తున్నారు. అలాగే సింహా విజయంతో ఉన్న బాలకృష్ణ..దాసరి తో పరమవీర చక్ర, పరుచూరి మురళితో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.