Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'సింహా' నిర్మాతలకు వార్నింగ్...మీడియాకు క్షమాపణ: బాలకృష్ణ
నిన్న(జూలై 24న) జరిగిన 'సింహా' చిత్రం అర్ధ దినోత్సవ వేడుకల్లో మీడియాకు బాలకృష్ణ తన నిర్మాతల తరుపున క్షమాపణలు తెలియచేసారు. హైదరాబాద్ మారియట్ హోటల్ లో జరిగిన ఈ వేడుకల్లో నిర్మాత పరుచూరి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేందర్..ఫిల్మ్ జర్నలిస్టులపై నోరు చేసుకున్నారు. దురుసుగా వ్యవహరించారు. దాంతో మీడియా మిత్రులంతా బోయ్ కాట్ చేయటానికి సిద్దమయ్యారు. వెంటనే ప్లేటు పిరాయించిన నిర్మాతలు..మీడియా వాళ్ళని ప్లీజ్ చేయటానికి ప్రయత్నించారు. అయితే ఆ ఛీప్ ట్రిక్స్ కి లొంగని వారు బయిటకు వెళ్ళబోయారు. ఇంతలో ఈ విషయాన్ని బాలకృష్ణకు కొందరు తెలియచేసారు. దాంతో వెంటనే స్పందించిన బాలకృష్ణ నిర్మాతల తరపున మీడియా వారిని క్షమాపణలు కోరారు. నిర్మాతలను గట్టిగానే మందలించారు. అంతేగాక మీడియావారు సింహా విజయానికి ఎంతో దోహదం చేసానన్నారు. మళ్ళీ ఇటువంటి తప్పు తిరిగి దొర్లరాదని నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో తిరిగి మీడియావారు ఈ పంక్షన్ ని కవర్ చేసారు.