Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘జమీందార్ నరసింహ రాయుడు’గా బాలయ్య
మనోజ్, దీక్షాసేథ్ జంటగా మంచు ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. శేఖర్రాజా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో నందమూరి హీరో బాలకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య సరసన పాంచిబోరా నటిస్తోంది. శ్రీరామ రాజ్యం సినిమా విడుదల రోజున అంతర్వేదిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగులోకి ఎంటర్ అయ్యారు బాలయ్య. నాలుగురోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ అంతర్వేదిలో జరుగనుంది.
అయితే బాలయ్య ఈ సినిమాలో ఏం పాత్ర పోషిస్తున్నారనే విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య ఇందులో 'జమిందార్ నరసింహ రాయడు"పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ పాత్రను రూపొందించారని, సినిమాకు బాలయ్యే ప్రధాన ఆకర్షణ అని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. 2012 ఏప్రిల్లో ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా సోనూసూద్, ప్రభు, రిషి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: బోబో శశి.