Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరీ జగన్నాధ్ కి బాలకృష్ణ కండీషన్...
మే ఇరవైన బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ చిత్రం మొదలుకావల్సింది..కాలేదు. కారణం బాలకృష్ణేనని తెలుస్తోంది. బాలకృష్ణ..పూరీ జగన్ చెప్పిన రెండు స్టోరీ లైన్స్ విని పెదివి విరిచారు. స్క్రిప్టు..సీన్ బై సీన్ డైలాగులతో సహా వినిపించాలి..అంతేగాని స్టోరీ లైన్ చెప్పద్దాని చెప్పారుట. అలాగే మాస్ ఆడియన్స్ కి నచ్చేలా కుటుంబ నేఫద్యం ఉన్న కథను మాత్రమే చెప్పమని ఆదేశించారుట., అంతేగాక యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ కలగలపి ఉండాలని వాటిని కూడా స్క్రిప్టు నేరేట్ చేసేటప్పుడు వివరించాలని కండిషన్ పెట్టారుట. సింహాకు అలా చేయబట్టే ఆ రేంజి సక్సెస్ సాధించానని ఆయన ఫీలవుతున్నారు.
ఇంతకాలం పూరీ జగన్నాధ్ తన హీరోలకు కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా స్టోరీలైన్ చెప్పి లాగించేస్తూండేవారు. అదృష్టం బావుంటే అది పోకిరీలా సెన్సేషన్ సృష్టించే కథ కావచ్చు..లేదా మొదటి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఏక్ నిరంజన్ అయిపోవచ్చు. ఇక పూరీ కూడా వరసగా ప్లాప్ లు ఇస్తూండటం కూడా బాలకృష్ణ అతి జాగ్రత్తకు కారణం అంటున్నారు. అలాగే దాసరి నారాయణరావు లాంటి సీనియర్ దర్శకుడుకి సైతం కథ పూర్తయ్యాకే సినిమా ప్రారంభిద్దామని కండీషన్ పెట్టారని చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తూంటే బాలకృష్ణ తన సింహా విజయాన్ని కంటిన్యూ చేసేటట్లు ఉన్నారని అభిమానులు సంబరపడుతున్నారు.