Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కసి మీదున్న బోయపాటి.. అంతొద్దంటూ కండీషన్ పెట్టిన బాలయ్య?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన 'వినయ విధేయ రామ' సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాపడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వల్ల డిస్ట్రిబ్యూటర్లు దాదాపు రూ. 30 కోట్లు నష్టపోయారు.
ఈ నష్టాల కంటే...సినిమా ప్లాప్ అయిందంటూ రామ్ చరణ్ బహిరంగ లేఖ రాయడమే బోయపాటిని ఎక్కువ బాధించిందట. లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం చెల్లించాలని రామ్ చరణ్, నిర్మాత దానయ్య డిసైడ్ అవ్వడం... వారితో బోయపాటి విబేధించడంతో పెద్ద గొడవ జరిగినట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి.
కసి మీదున్న బోయపాటి
‘వినయ విధేయ రామ' ఎఫెక్టుతో బోయపాటికి కొందరు స్టార్ హీరోల ప్రాజుక్టులు చేజారినట్లు తెలుస్తోంది. ఇపుడు ఆయనకు ఉన్న ఒకే ఒక్క ఆశాకిరణం నందమూరి బాలకృష్ణ. బాలయ్యతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన పూర్వ వైభవాన్ని చాటు కోవాలని ఈ మాస్ డైరెక్టర్ కసిమీద ఉన్నట్లు తెలుస్తోంది.
బాలయ్యతో రూ. 70 కోట్ల బడ్జెట్ సినిమా ప్లాన్ చేశారా?
బోయపాటి తన సినిమా సినిమాకు భారీ తనం, గ్రాండ్ లుక్ పెంచేస్తూ ఉంటారు. బాలయ్యతో చేయబోయే సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఆయన రూ. 70 కోట్ల బడ్జెట్ అంచనాలు వేసినట్లు తెలుస్తోంది.
రిస్క్ వద్దు.. కండీషన్ పెట్టిన బాలయ్య?
అయితే బోయపాటి రూ. 70 కోట్ల బడ్జెట్ అంచనాలు వేయడంపై బాలయ్య విబేధించినట్లు తెలుస్తోంది. అంత బడ్జెట్ అంటే చాలా రిస్క్ అవుతుందని, రూ. 50 కోట్లలో సినిమా పూర్తయ్యేలా డిజైన్ చేయాలని కండీషన్ పెట్టారట.
సినిమా ఎప్పుడు మొదలు?
ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్-మహానాయకుడు' బిజీలో ఉన్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదలకు సిద్దం అవుతోంది. నెక్ట్స్ బోయపాటితో చేయబో మూవీ వేసవిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.