Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఫ్యాన్స్ మాటలు పెడచెవిన పెట్టిన బాలయ్యకు తగిన శాస్తి...
యువరత్న బాలయ్య అంటే ఇప్పటికీ అభిమానుల్లో ఓ రకమైన ప్రేమ, వాత్సల్యం. అయితే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు మెండిగా వ్యవహరించే బాలయ్యను చూసి అభిమానులు కూడా భయపడిపోతున్నారు. 'సింహా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఈ లేటు వయసులో అందుకున్న బాలకృష్ణకు ఇక తిరుగులేదు అని అభిమానులు ఆనందిస్తున్న సమయంలో పిడుగులాంటి 'పరమవీర చక్ర"ను అభిమానుల నెత్తిన బాదేశాడు దాసరి.
నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడటం అని అభిమానులు హెచ్చరించినా వారి మాటలను పెడచెవిన పెట్టిన బాలయ్యకు తగిన శాస్తి జరిగిందని కొందరు అభిమానులు ఫీలయితే ఇప్పుడేమో 'శ్రీరామ రాజ్యం" కూడా బాలకృష్ణ నుండి రాబోతున్న మరో బాంబు అని భయపడుతున్నారు. అలనాటి ఆణిముత్యాలు బాపు-రమణల చేతిలో రూపుదిద్దుకుంటున్న 'శ్రీరామ రాజ్యం" నేటి తరం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో అనే డౌట్ ఇప్పటికీ అభిమానులను కలవర పెడుతోంది. వరుస పెట్టి కళాఖండాలను ఏరుకుంటున్న బాలయ్యకు బాపు-రమణలు ఎంతమేర కలిసొస్తారో వేచి చూడాల్సిందే..