Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫ్యాన్స్ మాటలు పెడచెవిన పెట్టిన బాలయ్యకు తగిన శాస్తి...
యువరత్న బాలయ్య అంటే ఇప్పటికీ అభిమానుల్లో ఓ రకమైన ప్రేమ, వాత్సల్యం. అయితే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు మెండిగా వ్యవహరించే బాలయ్యను చూసి అభిమానులు కూడా భయపడిపోతున్నారు. 'సింహా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఈ లేటు వయసులో అందుకున్న బాలకృష్ణకు ఇక తిరుగులేదు అని అభిమానులు ఆనందిస్తున్న సమయంలో పిడుగులాంటి 'పరమవీర చక్ర"ను అభిమానుల నెత్తిన బాదేశాడు దాసరి.
నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడటం అని అభిమానులు హెచ్చరించినా వారి మాటలను పెడచెవిన పెట్టిన బాలయ్యకు తగిన శాస్తి జరిగిందని కొందరు అభిమానులు ఫీలయితే ఇప్పుడేమో 'శ్రీరామ రాజ్యం" కూడా బాలకృష్ణ నుండి రాబోతున్న మరో బాంబు అని భయపడుతున్నారు. అలనాటి ఆణిముత్యాలు బాపు-రమణల చేతిలో రూపుదిద్దుకుంటున్న 'శ్రీరామ రాజ్యం" నేటి తరం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో అనే డౌట్ ఇప్పటికీ అభిమానులను కలవర పెడుతోంది. వరుస పెట్టి కళాఖండాలను ఏరుకుంటున్న బాలయ్యకు బాపు-రమణలు ఎంతమేర కలిసొస్తారో వేచి చూడాల్సిందే..