Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో బడా డైరెక్టర్తో బాలయ్య: అలాంటి కథతో మూవీ.. త్వరలోనే ప్రకటన
నటసింహా నందమూరి బాలకృష్ణ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇక, గత ఏడాది బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' చిత్రంతో బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకున్నారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Bigg Boss Nominations: 13వ వారం నామినేషన్ లిస్ట్ లీక్.. ఆ ఇద్దరు తప్ప అంతా.. వాళ్ల మధ్య భీకర ఫైట్
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తి అయిపోయింది. అలాగే, బాలయ్య దీని తర్వాత టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితోనూ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ 18 నుంచి జరగబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే చేతిలో రెండు సినిమాలను పెట్టుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మరింత సమాచారం లీకైంది. ఇప్పటికే ఆయన పరశురాంతో సినిమా చేయబోతున్నాడని టాక్ వచ్చింది. దీనిపై లేటెస్ట్ సమాచారం ప్రకారం.. తాజాగా ఈ డైరెక్టర్.. బాలయ్యకు స్క్రిప్టును వినిపించాడట. ఇది ఆయనకు ఎంతో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మిస్తారని టాక్.
నందినీ రాయ్ ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!
'సర్కారు వారి పాట' ఫలితంతో కాస్త నిరాశ పడిన పరశురాం.. నందమూరి బాలకృష్ణ కోసం పక్కా కమర్షియల్ స్టోరీని రెడీ చేశాడని తెలిసింది. ఈ సినిమాను ఇండియా రేంజ్లో రూపొందించేలా బడా ప్రొడ్యూపర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అంతలా అన్ని వర్గాల వాళ్లకు చేరువయ్యేలా దీన్ని యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందించబోతున్నారట.