Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆగిపోయిన యువరత్న బాలకృష్ణ 'నర్తనశాల' ప్రారంభంకానుందా??
మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రం 'నర్తనశాల'. సావిత్రి, ఎస్వీ రంగారావు, ముక్కామల తదితరులు నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ నటవారసుడు యువరత్న బాలకృష్ణ తీద్దామని సంకల్పించారు. కానీ ఈ చిత్రంలో ద్రౌపతిగా నటించాల్సిన సౌందర్య దుర్మరణం చెందటం లాంటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత 'లగాన్' ఫేం గ్రేసీ సింగ్ ను ద్రౌపతిగా నటింపజేస్తూ తిరిగి సినిమా ప్రారంభం కాబోతోందనే వార్తలు వినిపించాయి, కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.
ఆ తర్వాత బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈ చిత్రం గురించి ఎలాంటి వార్త రాలేదు. కానీ తాజా సమాచారం ఏంటంటే బాలయ్య తిరిగి ఈ సినిమాని ప్రారంభించాలని సంకల్పించారట. టాలీవుడ్ సరికొత్త సంచలనం 'మగధీర' చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం ఎన్నుకున్నారట. ఈ వార్తలు కానీ నిజమయితే మరో సాంకేతిక అద్భుతాన్ని మనం చూడబోతున్నామనమాట. మరి సౌందర్య చెయ్యాల్సిన ద్రౌపతి పాత్రకు ఎవరిని ఎన్నుకుంటారో అన్న ప్రశ్నకు సమాధానంగా స్నేహ పేరు బలంగా వినిపిస్తోంది.