Don't Miss!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆగిపోయిన యువరత్న బాలకృష్ణ 'నర్తనశాల' ప్రారంభంకానుందా??
మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నటించిన చిత్రం 'నర్తనశాల'. సావిత్రి, ఎస్వీ రంగారావు, ముక్కామల తదితరులు నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ నటవారసుడు యువరత్న బాలకృష్ణ తీద్దామని సంకల్పించారు. కానీ ఈ చిత్రంలో ద్రౌపతిగా నటించాల్సిన సౌందర్య దుర్మరణం చెందటం లాంటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత 'లగాన్' ఫేం గ్రేసీ సింగ్ ను ద్రౌపతిగా నటింపజేస్తూ తిరిగి సినిమా ప్రారంభం కాబోతోందనే వార్తలు వినిపించాయి, కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.
ఆ తర్వాత బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈ చిత్రం గురించి ఎలాంటి వార్త రాలేదు. కానీ తాజా సమాచారం ఏంటంటే బాలయ్య తిరిగి ఈ సినిమాని ప్రారంభించాలని సంకల్పించారట. టాలీవుడ్ సరికొత్త సంచలనం 'మగధీర' చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం ఎన్నుకున్నారట. ఈ వార్తలు కానీ నిజమయితే మరో సాంకేతిక అద్భుతాన్ని మనం చూడబోతున్నామనమాట. మరి సౌందర్య చెయ్యాల్సిన ద్రౌపతి పాత్రకు ఎవరిని ఎన్నుకుంటారో అన్న ప్రశ్నకు సమాధానంగా స్నేహ పేరు బలంగా వినిపిస్తోంది.