Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య?
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల శకం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగార్జు, వెంకటేష్ లాంటి వారు మల్టీస్టారర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలో రాబోతున్న చిరంజీవి 150వ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ చిత్రాన్నికూడా మల్టీస్టారర్గా చెప్పొచ్చు.
ఇక టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన బాలయ్య కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. తనకు ఇమేజ్కు తగిన కథ వస్తే మల్టీస్టారర్ సినిమాలు చేస్తానని సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి త్వరలోనే మనం బాలయ్యను మల్టీస్టారర్ సినిమాలో చూడబోతున్నామన్నమాట.
ప్రస్తుతం బాలయ్య సత్య దేవా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్.ఎల్.వి సినిమా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. ఫిల్మ్సిటీలోని ఫ్లెక్స్ హౌస్లో బాలకృష్ణ, ఇతర ముఖ్య పాత్రధారులపై హాస్య సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు.
''బాలకృష్ణను శక్తిమంతమైన నాయకుడిగా చూపించే చిత్రమిది. దర్శకుడు సినిమాను తెరకెక్కిస్తున్న విధానం చక్కగా ఉంది. బాలకృష్ణ పాత్ర చిత్రణ, కథ, కథనాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి'' అంటోంది చిత్రబృందం. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.
ఈ చిత్రం బాలయ్య గత చిత్రాల తరహాలో ఉండబోతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు సత్యదేవా మాట్లాడుతూ... అన్యాయం జరిగినప్పుడు, పేదవాడి ఆక్రందన విన్నప్పుడు, నీతికి చెదలు పడుతున్నప్పుడు భగవంతుడొస్తాడో రాడో తెలీదుగానీ ఓ నాయకుడు మాత్రం వస్తాడు. చీడ పురుగుల పీడ నుంచి వ్యవస్థను, తనని నమ్ముకొన్నవాళ్లను కాపాడతాడు. అలాంటి వ్యక్తి కథే మా చిత్రం అంటున్నారు దర్శకుడు సత్యదేవా.