హాట్ న్యూస్: నాగార్జున, బాలకృష్ణ కాంబినేషన్ లో చిత్రం
నందమూరి బాలకృష్ణ,అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం రూపొందే అవకాసం ఉందని విశ్వసనీయ సమాచారం.ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ క్రేజీ కాంబినేషన్ కి శ్రీకారం చుడుతున్నారు.మళయాళంలో హిట్ అయిన క్రిష్టియన్ బ్రదర్శ్ చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. అక్కడ మోహన్ లాల్, దిలీప్ హీరోలుగా ఈ చిత్రంలో నటించారు.
ఈ చిత్రం రైట్స్ ని తీసుకున్న బెల్లంకొండ బాలయ్యని,నాగార్జునని ఒప్పించారు.అయితే ఈ సినిమాని ఎవరు డైరక్ట్ చేస్తారు అన్న విషయం ఇంకా ఫైనలైజ్ కాలేదు.బి.గోపాల్ ని ఓ ఆప్షన్ గా తీసుకున్నట్లు చెప్తున్నారు.మళయాళంలో జోషి దర్శకత్వంలో మస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది.


Click it and Unblock the Notifications











