Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
బాలయ్య, నారా రోహిత్ కాంబినేషన్ చిత్రం టైటిల్
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, నారా రోహిత్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్లానింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ అంటూ ఒక టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఆ టైటిల్ క్షత్రియుడు. అయితే బాలకృష్ణ,నార రోహిత్ ఇద్దరిలో ఎవరు క్షత్రియుడు టైటిల్ జస్టిఫై చేసేటట్లు కథ అల్లుతున్నారో తెలియలేదు. ఇక ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుందని తెలుస్తోంది. నారా రోహిత్ పర్శనల్ గా దగ్గరుండి ఈ స్క్రిప్టుని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తన కెరీర్ కి బ్రేక్ రావాలని నారా రోహిత్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే దర్శకుడు ఓ యవ డైరక్టర్ అని ...ఆయన్ని బాలకృష్ణ యాక్టెప్ట్ చేయాలని తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక్కడినే షూటింగ్ లో ఉన్న రోహిత్ కి ఆ స్క్ర్రిప్టు బాగా నచ్చి వెంటనే చేయాలనే ఉత్సాహంతో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే బాలకృష్ణ.. మంచు మనోజ్ చిత్రంలో గెస్ట్ గా చేసి మల్టి స్టారర్ కి వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో తన బంధువైన నారా రోహిత్ చిత్రం వెంటనే ఓకే అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం ఫ్యామిలీ ,యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య..శ్రీమన్నారాయణ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. అది తీరిక దొరకగానే స్క్ర్రిప్టు పూర్తిగా వినటం జరగుతుందని చెప్పారుట. ఇక ఈ చిత్రం ఓకే అయితే సోలో నిర్మాతలే దీన్ని నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది. సోలో చి్త్రాన్ని యువత పేమ్ పరుశరామ్ డైరక్ట్ చేసారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు.
నారా రోహిత్ తాజా చిత్రం ఒక్కడినే విషయానికి వస్తే..నారా రోహిత్ హీరోగా గులాబీ మూవీస్ పై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఒక్కడినే'. నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో కథ...సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ..వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది. నారా రోహిత్ చేసిన 'సోలో', నిత్యామీనన్ తాజాగా నటించిన 'ఇష్క్' చిత్రాలు. ఈ రెండూ విజయవంతం కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్కు తగ్గ కథ ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది. ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు.
బాలకృష్ణ హీరోగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో యెల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేశ్ పుప్పాల నిర్మించారు. రవికుమార్ చావలి దర్శకత్వం వహించగా, చక్రి సంగీత స్వరాలు కూర్చారు. ఈ నెల 30 సినిమా విడుదల కాబోతోంది. మిగతా సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో 'శ్రీమన్నారాయణ' సినిమా చేశానని హీరో నందమూరి బాలకృష్ణ చెప్పారు. అలాగే జర్నలిస్ట్ పాత్రని ఈ సినిమాలో చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. కత్తి కంటే కలం గొప్పదని నిరూపించే అద్భుత పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా. ఇది సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం అన్నారు.