Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
జీవీ దర్శకత్వంలో బాలయ్య?
తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ చిత్రానికి సుధాకర్ నాయుడు అలియాస్ జీవి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. జీవి ఇది వరకు నితిన్ కథానాయకుడుగా 'హీరో", శ్రీకాంత్ కథానాయకుడుగా 'రంగా ది దొంగ" చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడ్డవే. అయినా సరే బాలయ్య జీవిపై నమ్మకం పెట్టి దర్శకత్వ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఈ విషయం ఇప్పడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం బాలయ్య బాపు దర్శకత్వంలో బాలయ్య నటించిన 'శ్రీరామరాజ్యం'చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయుడు' చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే మంచు మనోజ్ తో 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', వీటితో పాటు బి గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రంతో పాటు, జయంత్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత జీవి-బాలయ్య కాంబినేషన్ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.