Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిజమా... బాలకృష్ణ కు ఆ గెటప్ నప్పుతుందా?
హైదరాబాద్:బాలయ్య ..మాఫియాని రన్ చేస్తారా..మాఫియా డాన్ గా కనపడతారా అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మాఫియా డాన్ గా బాలకృష్ణ నప్పుతాడో లేదో అనేది ప్రక్కన పెడితే ఈ పాత్రను బాలకృష్ణ ఇష్టపడి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. కోన వెంకట్, గోపీ మోహన్ చెప్పిన కథలో బాలకృష్ణ..మాఫియా డాన్ గా కనపడతారని చెప్పుకుంటున్నారు. కామెడీ,ఎంటర్టైన్మెంట్ కలిపిన ఈ కథ బాలకృష్ణ ఇప్పటిదాకా చేసిన కథలకు డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు.
ఇటీవల ‘లెజెండ్' సినిమా విజయంతో మంచి జోరుమీదున్న బాలయ్య అటు పొలిటికల్గా కూడా అంతే జోరును ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు బాలకృష్ణ. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతోంది. ఇదిలా వుండగా తన 99వ చిత్రానికి సన్నాహాలు ప్రారంభించాడు బాలకృష్ణ. ఇటీవలే గోపీచంద్తో ‘లౌక్యం' చిత్రాన్ని రూపొందించిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది.
ఇప్పటికే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రానికి బాలకృష్ణ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపీమోహన్లు కలిసి పనిచేస్తారని, వారు బాలకృష్ణతో పనిచేయడం ఇదే ప్రథమం. బాలయ్యతో మంచి హిట్ చిత్రాలని నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్పైకి రానున్నట్లు తెలిసింది.
షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం విషయాలకి వస్తే..
ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు.
రుద్రపాటి రమణారావు నిర్మాత. అరకులో చిత్రీకరణ జరుగుతోంది. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల పాటు అరకులోనే చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
''లెజెండ్'తో బాలకృష్ణ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు. ఈ చిత్రం కోసం 'వారియర్', 'లయన్' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.