Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాలయ్యతో హ్యాట్రిక్ కాంబో సెట్ చేస్తున్న సీనియర్ నిర్మాత
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్క సినిమా హిట్టయిన డైరెక్టర్ హీరో కాంబోను కలిపేందుకు నిర్మాతలు చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోలు హిట్టు కొట్టడానికి ఇది రొటీన్ ఫార్ములా అని చెప్పవచ్చు. అయితే మధ్యలో డిజాస్టర్ వచ్చినా కూడా కొందరు పెద్దగా లెక్క చేయడం లేదు. త్వరలో ఒక సీనియర్ నిర్మాత కూడా బాలయ్య బాబుతో ఒక హ్యాట్రిక్ కాంబో సెట్ చేయాలని చూస్తున్నాడు.
ఆ నిర్మాత మరెవరో కాదు. బాలకృష్ణతో జై సింహా, రూలర్ వంటి కమర్షియల్ సినిమాలను నిర్మించిన సి.కళ్యాణ్. సీనియర్ కోలీవుడ్ డైరెక్టర్ కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో జై సింహా హిట్టవ్వగా రూలర్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సారి ఎలాగైనా మరో మంచి కథతో హిట్ కొట్టాలని ఈ కాంబోను సెట్ చేసేందుకు సి.కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు.
బోయపాటితో సినిమాను పూర్తి చేసిన తరువాత బాలయ్య ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నిర్మాతలు దర్శకులు రెడీగా ఉన్నప్పటికీ కథలు అంతగా నచ్చకపోవడంతో బాలయ్య ధైర్యంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నారు. ఇక మంచి కమర్షియల్ కథతో మేప్పిస్తే ఒప్పుకునే ఛాన్స్ ఉందని సి.కళ్యాణ్ ఇటీవల కెఎస్.రవికుమార్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. సినిమా స్క్రిప్ట్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయినట్లు టాక్ వస్తోంది. మరి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి మరి.