twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో బాలయ్య రొమాన్స్...

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ సరసన బద్రి చిత్రంలో నటించిన అమీషా పటేల్ గుర్తుందా. ఆమె తాజాగా బాలకృష్ణ సరసన బుక్కయిందని సమాచారం. సెప్టెంబర్ ఒకటవ తేదీనుంచి ప్రారంభం కానున్న పరుచూరి మురళి చిత్రం కోసం ఆమెను బుక్ చేసారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం హైదరాబాద్ లో ఆగస్టు 27న అఫీషియల్ గా లాంచ్ కానుంది. ఇక అమీషా పటేల్..బద్రి చిత్రం తర్వాత మహేష్ బాబు సరసన నాని, ఎన్టీఆర్ సరసన నరసింహ చిత్రంలో చేసింది. అయితే ఆ తర్వాత ఆమె లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో కనపడుతోంది. ఎమ్.ఎల్.కుమార్ చౌదరి..తమ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ నిర్మించే ఈ చిత్రం ఓ పవర్ ఫుల్ కథతో వస్తోందని వినికిడి. విజయ్.సి.కుమార్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చనున్నారు. ఇక పరుచూరి మురళి గతంలో పెదబాబు, ఆంధ్రుడు, రెచ్చిపో చిత్రాలు డైరక్ట్ చేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X