Don't Miss!
- News rasi phalalu today: ఈ రాశులవారికి శుభం; ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు!!
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
పార్వతి మిల్టన్ కోసం పట్టుబట్టిన బాలకృష్ణ
పార్వతి మిల్టన్ కి దూకుడు చిత్రంతో మళ్లీ క్రేజ్ వచ్చింది. దాంతో ప్రియమణిని తీసుకుందామనుకున్న ప్రాజెక్టులోకి ఆమె ఎంటరైంది. వివరాల్లోకి వెళ్ళితే..సామాన్యుడు దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో చేయటానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కీ రోల్ కి ప్రియమణిని అనుకున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం పట్టుబట్టి మరీ పార్వతి మిల్టన్ ని ప్రాజెక్టులోకి తెచ్చినట్లు చెప్తున్నారు. పార్వతి మిల్టన్ దీనిపై స్పందిస్తూ..ప్రాంక్ గా నాకు ఎవరిని ముందు అడిగారు..ఎవరు నన్ను ఈ ప్రాజెక్టుకు రికమెండ్ చేసారు వంటివేమి తెలియదు. ఈ చిత్రంలో పాత్ర గురించి చెప్పారు. చాలా బాగా నచ్చింది. వెంటనే ఓకే చేసేసాను అంది. ఇక తెలుగులో వరసగా భారీ చిత్రాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న సంస్ధ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అనుబంధ సంస్ధ ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.సామాన్యుడు ఫేం రవికుమార్ చావలి దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం 2012 జనవరిలో మొదలుకానుంది.ఈ విషయం మీడియాకు తెలియచేస్తూ నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ... '''మిరపకాయ్" తర్వాత మంచి హిట్ సినిమా తీయాలనే తలంపుతో ఎన్నో కథలు విన్నాను.
చివరకు బాలకృష్ణగారి కోసం రవి చావలి తయారు చేసిన కథ మాకెంతో నచ్చింది.ఈ కథ బాలకృష్ణగారు విని ఎంతో ఇన్స్పైర్ అయ్యారు.'శ్రీరామరాజ్యం"బాలయ్య కెరీర్లో స్పెషల్ మూవీగా నిలిచింది.ఇప్పుడు మా సంస్థ ద్వారా రానున్న ఈ సినిమా ఆయన కెరీర్లో సెన్సేషనల్ మూవీగా నిలుస్తుంది.బాలకృష్ణ పాత్రను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నారు. అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి. వచ్చే యేడాది జనవరి నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం.
పూర్తి వివరాలు త్వరలో చెబుతామని అన్నారు.బాలకృష్ణగారితో పనిచేయడం గర్వంగా ఉందని, ఇందులో బాలకృష్ణలోని కొత్త కోణాన్ని చూస్తారని రవికుమార్ చెప్పారు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం"విజయోత్సాహంలో ఉన్నారు.అలాగే మంచు లక్ష్మీ నిర్మిస్తున్న 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా" షూటింగ్లో పాల్గొంటున్నారు.పరుచూరి మురళి దర్శకత్వంలో ఆయన నటించిన 'అధినాయకుడు" నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది.