Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విగ్ కి ఇక గుడ్ బై అంటున్న బాలకృష్ణ
ఇక ప్రస్తుతం బాలకృష్ణ .. 'శ్రీమన్నారాయణ' తర్వాత ఏ సినిమాకూ పచ్చజెండా ఊపలేదు. రకరకాల వార్తలు వినిపిస్తున్నా ఇంతవరకూ ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. ఫిలిమ్నగర్ వర్గాల సమాచారం ప్రకారం 'లక్ష్యం' ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయనున్నారట. క్రేజీ రైటర్స్ కోన వెంకట్, గోపీమోహన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ను అందిస్తున్నారట. ఈ చిత్రానికి నిర్మాత, తదితర వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...'నేను, గోపీ మోహన్ తొలి సారిగా బాలయ్య సినిమాకు కలిసి పని చేయబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపారు. ఈచిత్రాన్ని కొత్త నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీ మోహన్ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ రైటర్లుగా కొనసాగుతున్నారు. ఇద్దరు కలిసి పని చేసిన దూకుడు, కింగ్ చిత్రాల్లో పంచ్ డైలాగులు, కామెడీ సీన్లు బాగా పేలాయి. ప్రస్తుతం వీరు జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రంతో పాటు, మంచు విష్ణు నటిస్తున్న 'దేనికైనా రెడీ', వెంకీ 'షాడో' చిత్రాలకు పని చేస్తున్నారు.
బాలయ్య త్వరలో సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాబోయే సినిమాలో చేబోతున్నట్లు తెలుస్తోంది. సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో తన గత సినిమా 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్గా రూపొందబోతున్న 'ఆదిత్య 999' చిత్రంలో ఇషా చావ్లాను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది.