Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి బాలకృష్ణ ఎంట్రీ
బాలకృష్ణ వరస సినిమాలు భాక్సాఫీస్ వద్ద పెయిల్యూర్ అవుతన్న సంగతి తెలిసిందే. మొన్న అధినాయకుడు చిత్రం బాగుంది అని టాక్ వచ్చినా నిలబడలేదు. ఈ నేఫధ్యంలో తన చిత్రాలకు సరైన ధియోటర్స్ నిర్మాతలు కేటాయించలేకపోవటం,డిస్ట్రిబ్యూషన్ సమస్యలు గమనించిన బాలయ్య చెక్ చెప్పటానికి నిర్ణయించుకున్నారు. స్వంతంగా తన కంటూ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవటానకి బాలయ్య డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు బిజినెస్ వర్గాల్లో వినపడుతోంది.
అందులోనూ తన కుమారుడు మోక్షజ్ఞ వచ్చే సంవత్సరం లాంచింగ్ అవుటూండటంతో అతనకీ ఈ సమస్యలు రానున్నాయని గ్రహించే ఈ నిర్ణయం తీసుకున్నారని వినపడుతోంది. అయితే ఎప్పటినుంచి ఈ పంపిణీ వ్యవస్ద ప్రారంభం కానుంది. కేవలం బాలకృష్ణ సినిమాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేక నందమూరి హీరోలందరి సినిమాలూ పంపిణీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే బాలకృష్ణ అబిమానులకు మాత్రం ఇది సంతోషపరిచే విషయమే.
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఆనాటి సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369'సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనూష్కని ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు మరియు వినోద్ కలిసి నిర్మించనున్నారు. కొండ కృష్ణం రాజు ఈ సినిమాని సమర్పించనున్నారు. ఈ సంవత్సరం ఆగష్టు నుండి ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క రవిచావలి దర్శకత్వంలో బాలయ్య హీరోగా శ్రీమన్నారాయణ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అలాగే బాలకృష్ణ గెస్ట్ గా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో మనోజ్ హీరోగా చేస్తున్నారు. మంచు లక్ష్మి ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. ఇందులోని పాత్రలకు, గంధర్య మహల్ సెట్కు వున్న సంబంధమేంటో సినిమా చూశాకే తెలుస్తుందని, జూన్లో చిత్రాన్ని విడుదల చేస్తామని లక్ష్మీ ప్రసన్న తెలిపింది.