twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాప్సీని పట్టుకున్న బాలకృష్ణ

    By Srikanya
    |

    బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'హరహరమహదేవ" చిత్రానికి ఇప్పటిదాకా హీరోయిన్‌ను ఎంపిక కాలేదన్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా తాప్సీ ఈ చిత్రంలో హీరోరదయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తమిళంలో కూడా తాప్సీ హవా కొనసాగిస్తోకన్న ఆమె తనకు వచ్చిన ఏ అవకాశమూ వదిలేటట్లు లేదు.దాంతో బెల్లంకొండ ఆమెను సంప్రదించి ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె గోపీచంద్‌తో కలిసి 'మొగుడు"చిత్రం చేస్తోంది. బాలకృష్ణ కధానాయకుడిగా బి.గోపాల్ దర్శకత్వంలో శ్రీ కాణిపాక వరసిద్ది వినాయకస్వామి ఆశీస్సులతో మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ సురేష్ 'హర హర మహాదేవ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ మధ్యన హైటెక్స్ లో జరిగింది. అప్పుడు పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ 'ముహూర్తానికి 25 డైలాగులు రాసాము. అందులో ఓ డైలాగును ప్రారంభదృశ్యంలో బాలకృష్ణ గారు చెప్పారు. అది 'సై అంటే శరభ శరభ... జై అంటే ఆయుష్మాన్ భవ... కాదని ఎదురొస్తే హరహర మహాదేవ'. ఈ సినిమా చాలా పవర్ ఫుల్ డైలాగులతో వుంటుంది. అద్భుతమైన పాత్ర బాలయ్య చేస్తున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత బాలయ్య సినిమాకు పనిచేస్తున్నాము. మంచి ఆకలితో ఉన్నాము. సినిమా కసిగా చేస్తున్నాము' అన్నారు. మరి తాప్సీ వచ్చి చేరింది కాబట్టి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందేమో చూడాలి.

    English summary
    Nandamuri Balakrishna and Tapsi Pannu (Jhummandhi Naadham fame)will be get together in Hara Hara Maha Deva Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X