Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టైటిల్ తలనొప్పిలో ఇరుక్కని ఎటూ తేల్చుకోలేకపోతున్న బాలకృష్ణ
బాలకృష్ణ, పరుచూరి మురళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'మహదేవ నాయుడు' అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నరసింహనాయుడు రేంజ్లో తన సినిమా ఆడాలన్న ఆలోచనతోనే నిర్మాత ఎంఎల్ కుమారచౌదరి ఈ టైటిల్ ని పెట్టుకున్నట్లు వినపడింది. అయితే హీరో బాలకృష్ణకు మాత్రం నరసింహనాయుడు తరువాత వచ్చిన బ్రహ్మనాయుడు అంతకు మించిన పవర్ఫుల్ టైటిల్ అయినా ప్లాప్ కావటంతో అలాంటి నాయుడు అని వచ్చే టైటిల్ అయిన మహదేవనాయుడుని ఇష్టపడటం లేదని సమాచారం. అంతేగాక తన రీసెంట్ హిట్ 'సింహా' రేంజ్లో టైటిల్ చిన్నగా ఉన్నా అదర గొట్టేలా ఉండాలని బాలయ్య చేసిన సూచనతో మళ్లీ టైటిల్ వేటలో పడ్డ దర్శక, నిర్మాతలు సింహం విసిరే పంజానే టైటిల్గా పెడదామని నిర్ణయించుకుని బాలకృష్ణకు చెప్పారు.
దాంతో పంజా టైటిల్కి ఓకే చెప్పటతో దాదాపుగా ఈ చిత్రానికి పంజానే ఖరారు చేద్దాముకున్నారు. అయితే ఈలోగా మరో సమస్య వచ్చి పడింది. కొందరు బాలయ్య అభిమానులు మాతం పంజా టైటిల్ పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు.సినిమా అటు ఇటు అయినా బాలయ్య పంజా విసరలేక పోయాడంటారని అలాంటి టైటిల్ పెట్టవద్దని అంటున్నారు. దాంతో తమకు తెలిసున్న వారి ద్వారా బాలకృష్ణను కలిసి మహదేవ నాయుడునే ఖరారు చేయాలని పట్టుపడుతున్నారుట. దాంతో అభిమానులుకు అత్యంత విలువ ఇచ్చే బాలకృష్ణ టైటిల్ డైలమోలో పడినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు పంజానా, మహదేవనాయుడా అనే టైటిల్ తేలకుంది.