Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హాట్ టాపిక్ :'గాడ్సే ' గా బాలకృష్ణ
హైదరాబాద్: ప్రస్తుతం 'లెజెండ్' చిత్రం ఫైనల్ టచెస్ లో బిజీగా ఉన్న బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సత్య అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి సంభందించిన కథ ఇప్పటికే నేరేట్ చేసాడని, ఇప్రెస్ అయిన బాలకృష్ణ జనరల్ ఎలక్షన్స్ అనంతరం డేట్స్ కేటాయిస్తానని చెప్పాడని వినికిడి. ఆ చిత్రం టైటిల్ 'గాడ్సే ' అని పెట్టారని చెప్తున్నారు. ఓ పెద్ద నిర్మాత నిర్మించే ఈ చిత్రం బాలయ్యకు 98 వ చిత్రం.
ఇక 14రీల్స్ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్'. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మార్చి 28న విడుదలకు సిద్దం చేస్తున్నారు.
తన దారికి ఎవ్వరూ అడ్డు రాకూడదు. వేరొకరి దారికి అతను అడ్డుగా వచ్చే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎదుటివారి పవర్ అయినా... పొగరైనా ఆయన అడుగుపెట్టేవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడంటే... చరిత్ర అంతా మారిపోతుంది. ఇంతకీ అతనెవరో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు బోయపాటి శ్రీను.
బోయపాటి శ్రీనుదర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లెజెండ్'. బాలకృష్ణ హీరోగా నటించారు. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే హీరోయిన్స్. జగపతిబాబు విలన్ గా నటించారు. హంసానందిని ప్రత్యేకగీతంలో ఆడిపాడింది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పకులు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''బాలకృష్ణ విజృంభణకు అద్దంపట్టే మరో చిత్రమిది. ఎదురులేని మనిషిగా ఆయన అభినయం ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభించింది. త్వరలోనే చిత్రాన్ని సెన్సార్కి పంపుతున్నాం'' అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.