తెలుగు దర్శకుడితో కోలీవుడ్ స్టార్ విజయ్, సెట్టవ్వడానికి అసలు కారణమిదే.. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్!
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రజనీకాంత్ కంటే కూడా విజయ్ అత్యధిక మార్కెట్ తో బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా మొదటి వారంలోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే అభిమానులకు నచ్చే విదంగా వీలైనంత వరకు సేఫ్ జోన్ లో కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక త్వరలో తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి బలమైన కారణం ఉంది.

మార్కెట్ ను మరింత పెంచుకోవాలని
లాక్ డౌన్ అనంతరం వచ్చిన మాస్టర్ సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతనికి తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ పెరుగుతున్నట్లు ఆ సినిమాతోనే ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని విజయ్ స్పెషల్ గా టార్గెట్ సెట్ చేసుకుంటున్నాడు.

వంశీ పైడిపల్లితో చెయ్యడానికి కారణం..
అయితే ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కథ చెప్పగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. వంశీతో సినిమా చేయడానికి విజయ్ మూడు విధాలుగా ఆలోచించాడట. ఇదివరకే అతను ఊపిరి సినిమాను తెలుగు , తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించి మంచి గుర్తింపు అందుకున్నాడు. పైగా దిల్ రాజు లాంటి టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన రికమండేషన్ కావడంతో వంశీతో సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నాడు.
Recommended Video

ఈ విధంగా అన్ని విషయాలు ఆలోచించి
అన్నిటి కంటే ముఖ్యంగా మహర్షి సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో వంశీపై ముందు నుంచే విజయ్ పాజిటివ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడట. ఈ విధంగా అన్ని విషయాలు ఆలోచించి వంశీ లాంటి కమర్షియల్ దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. త్వరలోనే ఈ కాంబోపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం

దిల్ రాజు బిగ్ ప్లాన్..?
విజయ్ మార్కెట్ ఇప్పటికే 300కోట్లకు పైగా చేరుకుంది. కరోనా లేకపోయి ఉంటే మాస్టర్ అంతకుమించి అనేలా హిట్టయ్యేది. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తో 65వ సినిమా చేస్తున్న విజయ్ ఆ తరువాత 66వ సినిమాను వంశీ పైడిపల్లితో చేసే అవకాశం ఉంది. ఆ సినిమాను విజయ్ కెరీర్ లోనే అత్యదిక బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











